Asianet News TeluguAsianet News Telugu

యువతితో సహజీవనం చేస్తూ.. మరో మహిళతో పెళ్లి, పిల్లలు.. చచ్చిపో అంటూ వేధింపులు.. చివరికి ఆమె చేసిన పని..

ఎనిమిదేళ్లుగా ఓ యువతితో సహజీవనం చేస్తూ మరో మహిళను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కన్నాడో వ్యక్తి. ఆ తరువాత యువతిని శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. 

woman committed suicide over livein partner harrassment in hyderabad - bsb
Author
First Published Mar 25, 2023, 7:28 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులు తట్టుకోలేక ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆర్ సదానంద్ అనే ప్రైవేటు ఉద్యోగి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని ఇందిరానగర్లో ఉంటాడు. రెడపాక పల్లవి (27) అదే ప్రాంతంలో నివసిస్తుంది. పల్లవి, సదానంద్ ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అతడు మరో యువతిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. 

పెళ్లయిన తర్వాత కూడా పల్లవితో సహజీవనం అలాగే కొనసాగింది. కాగా, కొద్దిరోజులుగా సదానంద్ పల్లవి మీద అకారణంగా  చిరాకు పడడం, దాడికి పాల్పడడం చేస్తున్నాడు. పల్లవి తల్లి లక్ష్మి పెద్దపల్లి జిల్లా బొట్ల వనపర్తిలోఉంటుంది. ఈనెల 22న పల్లవి తన తల్లికి ఫోన్ చేసింది. సదానంద్ గురించి చెబుతూ.. తనను అతనికి తీవ్రంగా హింసిస్తున్నాడని.. కొడుతున్నాడని తెలిపింది. చనిపొమ్మని వేధిస్తున్నాడని.. లేదంటే పుట్టింటికి వెళ్ళిపోవాలని ఒత్తిడి తెస్తున్నాడని తెలిపి వాపోయింది. దీంతో కంగారుపడ్డ పల్లవి తల్లి 23వ తేదీన పెద్దపల్లి నుంచి హైదరాబాదుకు బయలుదేరింది.  ఆమె మార్గమధ్యంలో ఉండగానే సదానంద్ నుంచి  ఫోన్ వచ్చింది.

హైదరాబాద్ లో ఇద్దరు స్కూలు విద్యార్థినులు అదృశ్యం.. ఫేర్వెల్ పార్టీకి వెళ్లి ఒకరు, ఇంట్లోనుంచి మరొకరు...

పల్లవి ఆరోజు రాత్రి  ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.  అంతకుముందే తనతో మాట్లాడడంతో పల్లవి తల్లికి విషయం అర్థమైంది. హైదరాబాద్ చేరుకున్న లక్ష్మి.. కూతురు పల్లవిని చూసిన తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సదానంద్ మీద ఫిర్యాదు చేసింది. రాత్రి కూతురు తనతో మాట్లాడిన విషయాలను పోలీసులకు తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదానంద్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లో చదువుకుంటూ, ఉద్యోగం చేస్తున్న ఓ డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాకలో కలకలం రేపింది. పెళ్లయి.. పిల్లలున్న మహిళతో వివాహేతర సంబంధం అతని ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలం మంగోల్ కు చెందిన లగిశెట్టి అభిషేక్ (19) డిగ్రీ చదువుకుంటున్నాడు. హైదరాబాదులోని సుచిత్ర ప్రాంతంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్నాడు. అక్కడే అతడికి ఓ వివాహితతో పరిచయమయ్యింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

అయితే ఆ వివాహిత ఇటీవల మరొకరితో చనువుగా ఉంటుంది. అది అభిషేక్ సహించలేకపోయాడు. మానసికంగా కృంగిపోయాడు. ఆమెతో చెప్పినా పట్టించుకోలేదు. దీంతో సిద్దిపేట, మంగోల్ లోని తన ఇంటికి వచ్చాడు. ఆ తరువాత ఈనెల 17వ తేదీన  తమ పొలంవద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు వెంటనే అతడిని హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స తీసుకుంటూ బుధవారం రాత్రి మృతి చెందాడు.

Follow Us:
Download App:
  • android
  • ios