Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఇద్దరు స్కూలు విద్యార్థినులు అదృశ్యం.. ఫేర్వెల్ పార్టీకి వెళ్లి ఒకరు, ఇంట్లోనుంచి మరొకరు...

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఇద్దరు స్కూలు విద్యార్థినులు అదృశ్యం అయ్యారు. 7వ తరగతి, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు వేర్వేరు చోట్ల కిడ్నాప్ అయ్యారు. 

two school girls missed in hyderabad - bsb
Author
First Published Mar 24, 2023, 11:23 AM IST

హైదరాబాద్ : హైదరాబాదులో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు బాలికలు అదృశ్యం అవ్వడం కలకలం రేపుతోంది. వి. శిరీష అనే 12 ఏళ్ల బాలిక ఫిలింనగర్ లోని రౌండ్ టేబుల్ గవర్నమెంట్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. అనుమానాస్పద స్థితిలో ఆ అమ్మాయి అదృశ్యమైంది. అయితే, ఆమె తండ్రి వి. కృష్ణ తమ కూతురిని డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఈ  మిస్సింగ్ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు ఈ మేరకు తెలిపారు… శిరీష ఫిలింనగర్ లోని దుర్గ భవాని నగర్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో ఏడవ తరగతి చదువుకుంటుంది.

తల్లిదండ్రులు జిహెచ్ఎంసిలో పనులకు వెళుతుంటారు.  రోజూలాగే 12వ తేదీ రోజు ఉదయం కూడా  తల్లిదండ్రులు పనులకు వెళ్లారు. కాసేపటికి కొడుకు నరేష్ ఫోన్ చేసి ఇంట్లో ఉన్న చెల్లి కనిపించడం లేదని చెప్పాడు. దీంతో వెంటనే పనుల నుండి హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. ఆ దంపతుల్లో చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో గాలించారు. అయినా కూతురి జాడ తెలియలేదు. కాగా, బాలిక తండ్రి కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ వరుసకు తనకు మేనల్లుడు అయ్యే వి. మల్లేష్ (22) కూడా కనిపించడం లేదని  తెలిపారు.  తమకు అతని మీద అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంటి చుట్టూ భారీగా పోలీసుల మోహరింపు..

తన కూతురిని డబ్బుల కోసమే కిడ్నాప్ చేశారని ఆందోళన వ్యక్తం చేశాడు. మల్లేష్ తల్లి సరోజమ్మ తమ కూతురిని తీసుకువెళుతున్నట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపించిందని తెలిపారు. ఇటీవల మల్లేష్ తనను రూ. 50,000 కావాలని అడిగాడని కానీ దగ్గర లేవని చెప్పడంతో కక్షపెంచుకున్నాడని ఈ నేపథ్యంలోనే తన కూతురికి మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారని కృష్ణ ఆరోపించాడు. ఈ మేరకు బంజార హిల్స్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని బాలిక కోసం గాలిస్తున్నారు.  ఎవరికైనా సమాచారం తెలిస్తే  8712660458 నెంబర్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే మరో విద్యార్థిని అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్రిన్ బేగం (14) అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో కనిపించకుండా పోయింది. బంజర హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు ఈ మేరకు తెలిపారు.. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10 లోని నూర్ నగర్ లో ఉండే అమ్రిన్ సెయింట్ నిజామియా హై స్కూల్ లో చదువుకుంటుంది. ఈనెల 21వ తేదీన పదవ తరగతి విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ చేశారు. దీనికోసం అమ్రీన్ బేగం జహీరా నగర్ లోని షాహిన్ కన్వెన్షన్ హాల్ కు వెళ్ళింది. 

రాత్రి 11 గంటలకు అమ్రీన్  సోదరుడు ఫోన్ చేయగా.. ఇంకా ప్రోగ్రాం పూర్తికాలేదని కాసేపట్లో వస్తానని తెలిపింది. కొద్దిసేపటి తర్వాత ఆమె సోదరుడు హనీఫ్ అమ్రీన్ కోసం ఆ హాలు దగ్గరికి వచ్చాడు. కానీ ఆమె కనిపించలేదు. దీంతో కంగారుపడిన అతను తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపి.. రాత్రి ఒంటిగంట వరకు బంధుమిత్రుల ఇళ్లల్లో గాలించారు. అయినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. షాహిన్ కన్వెన్షన్ హాల్ నుంచి రాత్రి 11:30 ప్రాంతంలో తన చెల్లెలు మాయమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios