Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడి మోసం..పురుగుల మందుతాగుతూ సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య..

ప్రేమించాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. ఇంట్లో నుంచి తీసుకువెళ్లి ఓ దగ్గర పెట్టి.. మొహం చాటేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. 

woman committed suicide by taking selfie video over lover cheating in mancherial
Author
First Published Oct 8, 2022, 6:43 AM IST

మంచిర్యాల :  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించి మోసం చేశాడంటూ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తనకు అన్యాయం జరిగిందని బాధితురాలు పురుగుల మందు తాగుతూ.. రికార్డు చేసుకున్న సెల్ఫీ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.  మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని షంషీర్ నగర్ కు చెందిన తేజశ్రీ.. నెన్నెల మండలం లంబాడి తండాకు చెందిన ధరావత్ రాజ్ కుమార్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. 

పెళ్లి చేసుకుంటానని చెప్పి యువతిని ఇంటి నుంచి తీసుకు వెళ్లిన రాజ్ కుమార్..  ఆమెను ఓ చోట ఉంచి పెళ్ళి వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో రాజకుమార్ తప్పించుకుని తిరుగుతుండడంతో మోసపోయానని యువతి గ్రహించింది. మనస్తాపంతో పురుగుల మందు తాగింది. ఆటోలో లంబాడి తండాకు వెళ్తుండగా మార్గమధ్యంలో స్పృహ కోల్పోయింది. గమనించిన డ్రైవర్  తేజశ్రీని స్థానిక పీహెచ్సీకి తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయింది. రాజకుమార్ ను నమ్మి అందరినీ వదిలేసి వచ్చానని.. ఇప్పుడు నాకు దిక్కెవరు అంటూ.. తేజశ్రీ ఆత్మహత్యకు పాల్పడే ముందు సెల్ఫీ వీడియోలో మాట్లాడిన మాటలు.. చూసిన వారందరిని కంటతడి పెట్టిస్తున్నాయి. 

తెలంగాణ‌లో మ‌రో ఐదు రోజులు మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు

ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 6న సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. ఓ టిడిపి నేత లైంగిక వేధింపులకు బాలిక బలి అయ్యింది. కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం ఎర్రవెల్లి గ్రామంలో బాలిక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న టిడిపి నేత రాళ్లపల్లి ఇంతియాజ్ తనను లైంగికంగా వేధించాడని, ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలో బాలిక తెలిపింది.

ప్రేమపేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఇంతియాజ్.. చెప్పినట్లు చేయకపోతే మార్ఫింగ్ ఫోటోలు ఆన్లైన్లో ఉంచుతానని బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కదిరి రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. 

ఇలాంటి ఘటనే వరంగల్ జిల్లాలో సెప్టెంబర్ 28న వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతి భర్తతో పాటు అతడి బంధువులు వేధింపులు తాళలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన గీసుకొండ మండలం కోట గండి వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన ఇబ్రహీం, నసీమా దంపతులకు కూతురు నూర్జహాన్. అదే గ్రామానికి చెందిన రవి, అరుణ దంపతుల కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  తర్వాత హైదరాబాదులో కాపురం పెట్టారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు భర్త శరత్ తో పాటు అత్తమామలు,  ఆడబిడ్డ, ఆమె భర్త కట్నం కోసం వేధిస్తూ చిత్రహింసలకు గురి చేశారు. దీనిపై పలుమార్లు గ్రామంలో నిర్వహించినా..  వారి తీరు మారలేదు. వారి వేధింపులు భరించలేక నూర్జహాన్ మంగళవారం సాయంత్రం గీసుకొండ మండలం అడగండి వద్దకు వచ్చి క్రిమిసంహారక మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అపస్మారకస్థితిలో ఉన్న ఆమెను స్థానికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే, మందు తాగే ముందు నూర్జహాన్ సెల్ ఫోన్ లో తన బాధను వీడియో తీసి తెలిసినవారికి వాట్సాప్ లో పెట్టింది.

Follow Us:
Download App:
  • android
  • ios