స్నానం చేస్తుండగా వీడియో తీసి....వివాహితపై మూడేళ్లుగా అత్యాచారం
రాచకొండ కమీషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికి మరో వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి దాన్ని చూపించి మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా బెదిరించి సదరు వివాహితపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువవడంతో తట్టుకోలేక వివాహిత పోలీసులను ఆశ్రయించింది.దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
రాచకొండ కమీషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ లో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికి మరో వివాహితపై కన్నేశాడు. ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీసి దాన్ని చూపించి మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు. ఇలా బెదిరించి సదరు వివాహితపై గత మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతడి వేధింపులు ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువవడంతో తట్టుకోలేక వివాహిత పోలీసులను ఆశ్రయించింది.దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పీపల్ పహడ్ గ్రామంలో ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే అదే గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య(45) అనే స్టోన్ కట్టింగ్ వర్కర్ ఈ వివాహితపై కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని భావించిన అతడు అందుకోసం ఓ పథకం వేశాడు. సదరు వివాహిత స్నానం చేస్తుండగా రహస్యంగా ఈ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు.
ఇక అప్పటినుండి ఆ మహిళకు నరకం చూపించడం ప్రారంభించాడు. తన లైంగిక వాంచ తీర్చకుంటే భర్తతో పాటు గ్రామస్తులకు ఈ వీడియో చూపిస్తానని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. ఇలా బెదిరించి గత మూడేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. అయితే అతడి వేధింపులు మరీ శృతిమించడంతో తట్టుకోలేక పోయిన
వివాహిత పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం కింది లింక్ క్లిక్ చేయండి
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, గోళ్లతో రక్కి, చేతులు విరిచి హత్య
ఇద్దరమ్మాయిలపై 11మంది గ్యాంగ్ రేప్, స్నేహితుడి నిర్వాకమే...
యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మహిళ