Asianet News TeluguAsianet News Telugu

వేములవాడలో గాలి దుమారం బీభత్సం.. కూలిన బీఎస్పీ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణం, టెంట్లు.. 15 మందికి గాయాలు..

వేములవాడలో బీఎస్పీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ మధ్యలోనే ఆగిపోయింది. అనుకోకుండా వచ్చిన గాలి దుమారం ఆ సభా ప్రాంగణాన్ని నేలకూల్చింది. అలాగే టెంట్లు కూడా కూలిపోయాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి.

Wind noise in Vemulawada.. BSP Praja Ashirwada Sabha premises and tents collapsed.. 15 people injured..ISR
Author
First Published Nov 20, 2023, 3:48 PM IST

వేములవాడలో ఒక్క సారిగా వచ్చిన గాలి దుమారం బీభత్సం సృష్టించింది. దాని ప్రభావంతో ఎన్నికల నేపథ్యంలో బీఎస్పీ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభ మధ్యలోనే ఆగిపోయింది. ఆ కార్యక్రమం సభా వేదిక, టెంట్లు కూలిపోవడంతో 15 మందికి గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

Shanti Dhariwal : మాకు డబ్బులొద్దు.. న్యాయం, గౌరవం కావాలి.. శాంతి ధరివాల్ కు మహిళల నుంచి వ్యతిరేకత

వేములవాడ సిటీలోని బైపాస్ రోడ్డులో సోమవారం బహుజన సమాజ్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, వేములవాడ, సిరిసిల్ల  బీఎస్పీ అభ్యర్థులు డాక్టర్ గోలి మోహన్, పిట్టల భుమేష్ తో పాటు కార్యకర్తలు హాజరయ్యారు.

విషాదం.. నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సూసైడ్.. ఏం జరిగిందంటే ?

అయితే ఈ సభ కొనసాగుతున్న క్రమంలో ఒక్క సారిగా గాలి దుమారం వచ్చింది. దీంతో ఒక్క సారిగా ఈ కార్యక్రమం కోసం వేసిన టెంట్లు, సభా ప్రాంగణం కూలిపోయింది. ఆకస్మాత్తుగా జరిగిన ఈ ఘనటలో అక్కడున్న మహిళలు పరుగులు పెట్టారు. దీని వల్ల అక్కడున్న 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడ పోలీసులు అలెర్ట్ అయ్యారు. క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో హాస్పిటల్ కు తరలించారు. అయితే అనుకోకుండా సంభవించిన ఈ ప్రమాదంతో ప్రజా ఆశీర్వాద సబ మధ్యలోనే ఆగిపోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios