Asianet News TeluguAsianet News Telugu

అక్రమ సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపేసిన మహిళ

హైదరాబాదులోని గచ్చిబౌలి ప్రాంతంలో గల గోపన్ పల్లి తండాలో జరిగిన మేస్త్రీ శేఖర్ హత్య కేసును పోలీుసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యనే అతన్ని చంపినట్లు పోలీసులు గుర్తించారు.

Wife kills husband at Gachibowli in Hyderabad
Author
Gachibowli, First Published Oct 15, 2021, 7:52 AM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గోపన్ పల్లి ప్రాంతంలో జరిగిన హత్య కేసును గచ్చిబౌలి పోలీసులు ఛేదించారు. ఈ నెల 11వ తేదీన మేస్త్రీ శేఖర్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు దారి తీసినట్లు గుర్తించారు.

 తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే కోపంతో భార్యనే మేస్త్రీ శంకర్ ను తన ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి భార్యను, ఆమె ప్రియుడిని గురువారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. Gachibowli ఇన్ స్పెక్టర్ గోనె సురేష్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.   

Also Read: వివాహేతర సంబంధం... కట్టుకున్న భర్తను కన్నకొడుకుల సాయంతో చంపిన మహిళ

తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం ధర్మారం తండాకు చెందిన ముడావత్ శేఖర్ (30) అదే ప్రాంతానికి చెందిన ముడావత్ జ్యోతి (26)ని పదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం గచ్చిబౌలీ పోలీసు స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాకు దంపతులు వలస వచ్చారు. శేఖర్ మేస్త్రీ పని చేస్తుండగా జ్యోతి కూలీపనులు చేస్తూ వచ్చేది. 

రామచంద్రాపురం ఉస్మాన్ నగర్ కు చెందిన దుడ్డెల మాణిక్యం (42) తెల్లాపూర్ కు చెందిన రాజీవ్ రెడ్డి వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రాజీవ్ రెడ్డి తెల్లాపూర్ లో ఇటీవల రెండు విల్లాలు కొన్నాడు. పనికోసం శేఖర్ దంపతులు వాటిలోకి వెళ్లారు. ఆ క్రమంలో మాణిక్యంతో వారికి పరిచయం ఏర్పడింది. 

వారికి దగ్గరవుతూ వచ్చిన మాణిక్యం జ్యోతితో అక్రమ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అది పసిగట్టిన శేఖర్ ఆమెను తరుచూ కొడుతూ వచ్చాడు. దాంతో ప్రియుడు మాణిక్యంతో కలిసి జ్యోతి భర్తను చంపేందుకు పథకం వేసుకుతంది. 

Also Read: హైదరాబాద్‌లో భర్తను చంపిన భార్య.. ఐదుగురు దోషులకు యావజ్జీవ శిక్ష

తమ పథకంలో భాగంగా ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మాణిక్యం శేఖర్ కు ఫోన్ చేశాడు. మద్యం తాగేందుకు పిలించాడు. శేఖర్ కు పురుగుల మందు తాగిన మద్యం తాగించాడు. ఆ తర్వాత గొడ్డలితో నరికి మేస్త్రీ శేఖర్ ను చంపాడు. అక్కడి నుంచి పారిపోయాడు. 

ఈ నెల 11వ తేదీన మేస్త్రీ శేఖర్ హత్యకు గురైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఫోన్ కాల్స్ ను పరిశీలించారు. వాటి ఆధారంగా నిందితుడు మాణిక్యంతో పాటు మృతుడు శేఖర్ భార్య జ్యోతిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios