భర్తను హత్య చేసి.. శవం పక్కనే ప్రియుడితో...
జగన్ మర్మాంగాలను దేవిక గట్టిగా పిసికేస్తుండగా అతడి ఛాతిపై బెనర్జి కూర్చొని ముఖాన్ని, గొంతును నులిమేశారు. అరగంట పాటు జగన్ ప్రాణం రక్షించుకునేందుకు పెనుగులాడినప్పటికీ లాభం లేకపోయింది.
భర్తను మర్మంగాలపై తన్ని.. ఆ తర్వాత అతనిపై హిట్ కొట్టి.. గొంతు పిసికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఫిల్మ్ నగర్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ హత్య కేసులో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. మొదట తానే స్వయంగా తన భర్తను హత్య చేసినట్లు తెలిపిన దేవిక.. ప్రియుడ్ని కాపాడేందుకే ఇలా చేసినట్లు విచారణలో తేలింది.
పూర్తి వివరాల్లోకి వెళితే...ఫిలింనగర్లోని జ్ఞాని జైల్సింగ్ నగర్ బస్తీలో బర్త్ప్లేస్ ఆస్పత్రిలో పనిచేస్తున్న బానోతు జగన్(35), దేవిక(30) దంపతులు అద్దెకుంటున్నారు. వీరికి ఎనిమిదేళ్ల కొడుకు ఉదయ్, ఆరేళ్ల కూతురు జ్యోతశ్రీ ఉన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన తోట బెనర్జి(32) ఫిలింనగర్లోని అడ్వాన్ సాఫ్ట్ బీపీఓలో లైజన్ ఆఫీసర్గా పని చేస్తున్నాడు.
ఇదే సంస్థలో దేవిక హౌస్ కీపింగ్ పనిచేసేది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి దగ్గరయ్యారు. ఏడాది క్రితం బెనర్జి దేవిక తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. కుటుంబ సభ్యులు అతడిని తిట్టి పనిచేస్తున్న సంస్థ వద్దకు వచ్చి చితకొట్టారు. ఆరు నెలల క్రితమే దేవిక అక్కడ హౌస్కీపింగ్ పనుల నుంచి తప్పుకుంది.
అయితే భర్త కళ్లుగప్పి ప్రియుడితో తరచూ కలుస్తుండేది. అనుమానం వచ్చిన జగన్ పలుమార్లు ఆమెను హెచ్చరించి పరువుతీయవద్దంటూ బెదిరించాడు. ఇలా అయితే లాభం లేదనుకున్న బెనర్జి, దేవిక ఒకే ఇంట్లో అద్దెకుంటే ఈ గొడవ ఉండదని అనుమానాలు కూడా రావని నిశ్చయించుకున్నారు. రెండు నెలల క్రితం బెనర్జి.. జైల్సింగ్ నగర్లోని ఓ ఇంటిలో జగన్ దంపతులను అద్దెకు దిగేలా చేశాడు. తర్వాత రెండు రోజులకే తాను కూడా అదే ఇంటి పెంట్హౌస్లోకి మారుపేరుతో అద్దెకు దిగాడు. ఏ మాత్రం అనుమానం రాకుండా ఇద్దరూ కలుసుకునేవారు.
తమ ప్రేమకు అడ్డు వస్తున్న భర్తను హతమార్చాలని ఇద్దరూ ప్లాన్ వేసి సోమవారం అర్ధరాత్రి ఇందుకు సరైన సమయంగా నిర్ణయించారు. బెనర్జీని అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఇంట్లోకి పిలిపించి నిద్రిస్తున్న జగన్ మర్మాంగాలను దేవిక గట్టిగా పిసికేస్తుండగా అతడి ఛాతిపై బెనర్జి కూర్చొని ముఖాన్ని, గొంతును నులిమేశారు. అరగంట పాటు జగన్ ప్రాణం రక్షించుకునేందుకు పెనుగులాడినప్పటికీ లాభం లేకపోయింది.
అప్పటికే నిద్ర లేచిన పిల్లలు ఈ ఘటనను చూస్తుండడంతో వారిద్దరినీ ఈ కసాయితల్లి బాత్రూమ్లో వేసి గడియ వేసింది. భర్త చనిపోయాక అక్కడే మద్యం తాగి ఇద్దరూ కలిసి గడిపినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే గంట తర్వాత బావ చనిపోయాడంటూ దేవిక తన సోదరుడికి ఫోన్ చేసింది. అప్పటికే బెనర్జీ అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ విషయం పోలీసుకు చేరడంతో వారు అక్కడకు చేరుకోగా దేవిక చేతులకు గాట్లు పెట్టుకొని వారిని నమ్మించేయత్నం చేసి విఫలమైంది.
అయితే.. పిల్లలు.. తల్లితోపాటు మరో వ్యక్తి కూడా ఇంట్లో ఉన్నాడని చెప్పడంతో.. పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు. 24గంటల్లోనే మర్డర్ మిస్టరీ వీడింది. ప్రియుడు బెనర్జీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సంబంధిత వార్తలు ఇక్కడ చదవండి..
1.ఫిల్మ్నగర్లో భర్తను చంపిన దేవిక: పారిపోయిందేవరు?
2.అందుకే చంపా: భర్త హత్యపై దేవిక, ఆ గడ్డం వ్యక్తి ఎవరు?