పెళ్లి చేసుకొన్న విషయం కూడ తమకు తెలియదని.. పెళ్లి చేసుకొన్నానే హేమంత్, అవంతి ఈ విషయాన్ని తమకు చెప్పారని హేమంత్ తల్లి రాణి చెప్పారు.
హైదరాబాద్: పెళ్లి చేసుకొన్న విషయం కూడ తమకు తెలియదని.. పెళ్లి చేసుకొన్నానే హేమంత్, అవంతి ఈ విషయాన్ని తమకు చెప్పారని హేమంత్ తల్లి రాణి చెప్పారు.
సంగారెడ్డి సమీపంలో హేమంత్ ను అవంతి కుటుంబసభ్యులు వచ్చినట్టుగా సమాచారం రావడంతో తాము బైక్ పై అక్కడికి వెళ్లే సరికి తన కొడుకు , కోడలును కిడ్నాప్ చేశారని రాణి తెలిపారు.
ఎనిమిదేళ్లు హేమంత్, అవంతి ప్రేమించుకొన్నారని రాణి చెప్పారు. ఇంట్లలో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని తాను వారిద్దరికి చెప్పినట్టుగా రాణి గుర్తు చేసుకొన్నారు. అవంతిని ఇంట్లో బంధిస్తే ఆ అమ్మాయి తప్పించుకొని మా ఇంటికి వచ్చిందన్నారు.
ఈ ఏడాది జూలై 10వ తేదీన పెళ్లి చేసుకొన్నారని రాణి చెప్పారు. పెళ్లి చేసుకొన్న తర్వాతే ఆ విషయాన్ని వాళ్లు తనకు చెప్పారన్నారు.తన కొడుకు చాలా మంచివాడని ఆమె చెప్పారు. అవంతి కుటుంబసభ్యులే మంచివాళ్లు కాదన్నారు.
రాత్రి పూట తమకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడేవారని ఆమె చెప్పారు. వాళ్లే తాగుబోతులు.. వారి గురించి ఈ కాలనీ వాళ్లను అడిగితే తెలుస్తోందన్నారు. అవంతి తల్లీదండ్రులు కఠినాత్ములన్నారు.
Also read:చందానగర్లో పరువు హత్య: 12 మంది అరెస్ట్
పెళ్లైన తర్వాత కాలనీ నుండి వేరే చోటుకు వెళ్తే అమ్మాయిని తీసుకెళ్లారని అనుకొంటారని భావించి అదే కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు. పెళ్లైన తర్వాత మూడు నెలలుగా అవంతి, హేమంత్ ఎక్కడికి వెళ్లినా కూడ కలిసే వెళ్తున్నారని ఆమె చెప్పారు.
