గోకుల్చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ల కేసు: సెప్టెంబర్ 4న తుది తీర్పు
గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ళ కేసులో తుది తీర్పును సెప్టెంబర్ 4 వ తేదీన ఇవ్వనున్నట్టు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం నాడు ప్రకటించింది.
హైదరాబాద్: గోకుల్ చాట్, లుంబినీ పార్క్ పేలుళ్ళ కేసులో తుది తీర్పును సెప్టెంబర్ 4 వ తేదీన ఇవ్వనున్నట్టు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం నాడు ప్రకటించింది.
సోమవారం నాడు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు జడ్జి శ్రీనివాసరావు వీడియో కాన్పరెన్స్ ద్వారా చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్న ఐదుగురు నిందితులను విచారించారు.
సెప్టెంబర్ 4 వ తేదీన వెల్లడించనున్నట్టు ఈ తీర్పును వెలువరించనున్నారు.
గోకుల్ చాట్.. లుంబిని పార్క్ పేలుళ్ల కేసుకు సంబంధించి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం నాడు తీర్పును వెలువర్చాలని భావించారు. అయితే నిందితులకు సంబంధించి వీడియోకాన్పరెన్స్ నిర్వహించిన తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జి శ్రీనివాసరావు ఈ తీర్పును సెప్టెంబర్ 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ పేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రియాజ్ భత్కల్ పెద్ద ఇంకా పోలీసులకు చిక్కలేదు. 2007 ఆగష్టు 25వ తేదీన హైద్రాబాద్లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్ వద్ద పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనలో సుమారు 42 మంది మృత్యువాత పడ్డారు.వందలాది మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 11 మందికిపై ఎన్ఐఏ చార్జీషీట్ దాఖలు చేసింది. వీరిలో ఇప్పటికే ఐదుగురిని పోలీసులు
చర్లపల్లి జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.
ఈ కేసులో కీలకంగా ఉన్న ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. చర్లపల్లి జైలులో ఉన్న శిక్షను అనుభవిస్తున్న నిందితులను ఎన్ఐఏ ప్రత్యేక జడ్డి వీడియో కాన్పరెన్స్ ద్వారా సోమవారం నాడు విచారించారు.
ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ పాల్పడింది. ఇద్దరు రియాజ్ భత్కల్ తో పాటు యాసిన్ భత్కల్ మాత్రం ఇంకా పోలీసులకు చిక్కలేదు. మరో వైపు ఈ ఘటనకు పాల్పడిన పదకొండు మందిలో మరో నలుగురు ఎవరనే విషయాన్ని ఇంకా పోలీసులు గుర్తించలేదు.
ఈ ఘటనకు సంబంధించిన 286 మంది సాక్షులను విచారించిన పోలీసులు 1125 పేజీల చార్జీషీటును దాఖలు చేశారు. మూడు విడతలుగా చార్జీషీటును దాఖలు చేశారు.
ఈ వార్త చదవండి
గోకుల్చాట్, లుంబిని పార్క్ పేలుళ్లు: వాదనలు పూర్తి, ఆగష్టు 27న తీర్పు