Asianet News TeluguAsianet News Telugu

ప్రేమించానని మోసం చేసింది: మనస్వినిపై వెంకటేష్

ప్రాణంగా ప్రేమించిన మనస్విని తనను మోసం చేసిందని  ఆమె ప్రియుడు వెంకటేష్ చెప్పారు. తమ మధ్య గొడవ సందర్భంగా కత్తి ఆమె గొంతుకు తగిలిందని ఆయన వివరించారు.
 

venkatesh sensational comments on manaswini
Author
Hyderabad, First Published Jul 12, 2019, 5:39 PM IST

హైదరాబాద్: ప్రాణంగా ప్రేమించిన మనస్విని తనను మోసం చేసిందని  ఆమె ప్రియుడు వెంకటేష్ చెప్పారు. తమ మధ్య గొడవ సందర్భంగా కత్తి ఆమె గొంతుకు తగిలిందని ఆయన వివరించారు.

ఇటీవల దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ లాడ్జీలో మనస్విని అనే యువతిపై వెంకటేష్ అలియాస్ ప్రవీణ్ కుమార్  దాడికి దిగాడు. ఈ ఘటనలో  మనస్విని తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వెంకటేష్ కూడ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందాడు.

వెంకటేష్ తో  ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూ చేసింది.ఈ  ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర  విషయాలను వెల్లడించారు.  తాను ప్రాణంగా ప్రేమించిన మనస్విని తనను మోసం చేసి వేరే యువకుడితో తిరుగుతోందన్నారు. 

దీంతో చివరి సారిగా మనస్వినితో మాట్లాడి చనిపోవాలని భావించినట్టుగా వెంకటేష్ చెప్పారు.  ఈ కారణంగానే ఆమెను తాను దిగిన లాడ్జీకి పిలిపించినట్టుగా వెంకటేష్ వివరించారు. తన ముందే  మనస్విని తన బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడిందన్నారు. దీంతో ఆమెతో గొడవకు దిగినట్టుగా వెంకటేష్ చెప్పారు.

ఈ విషయమై ఇద్దరి మద్య గొడవ జరిగిందన్నారు.ఈ గొడవలో తన చేతిలోని కత్తి  మనస్విని గొంతుకు తగిలిందన్నారు. కానీ తనకు మనస్వినిని చంపే ఉద్దేశ్యం లేదన్నారు.  ఆ తర్వాత తాను కూడ కత్తితో పొడుచుకొన్నట్టుగా వెంకటేష్ చెప్పారు.

సంబంధిత వార్తలు

ప్రేమోన్మాది దాడి: ఆసుపత్రిలో కోలుకొంటున్న మనస్విని
 

Follow Us:
Download App:
  • android
  • ios