Asianet News TeluguAsianet News Telugu

పాల్వంచ సూసైడ్ కేసు : ఏ2 గా వనమా కుమారుడు రాఘవేంద్రరావు..

రామకృష్ణ మాట్లాడిన సెల్ఫీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు. సీడీని న్యాయస్థానంలో సమర్పించారు. పరారీలో ఉన్న రాఘవేంద్రరావును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం డిమాండ్ చేశారు. 

Vanama son Raghavendra Rao as A2 In Palvancha Suicide Case
Author
Hyderabad, First Published Jan 5, 2022, 9:08 AM IST

ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత Palvanchaలో సోమవారం జరిగిన నాగ రామకృష్ణ కుటుంబం suicide ఘటనలో కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama Venkateswara Rao కుమారుడు, తెరాస నేత Vanama Raghavendra Rao చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన ఆత్మహత్యకు రాఘవేంద్రరావే ప్రధాన కారణమని రామకృష్ణ Suicide note లో పేర్కొన్న నేపథ్యంలో పోలీసులు ఎఫ్ఐఆర్ లో అతన్ని ఏ2గా చేర్చారు.

రామకృష్ణ మాట్లాడిన Selfie videoను స్వాధీనం చేసుకున్నారు. సీడీని న్యాయస్థానంలో సమర్పించారు. పరారీలో ఉన్న రాఘవేంద్రరావును పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ తెలిపారు. ఎమ్మెల్యే కుమారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మంగళవారం డిమాండ్ చేశారు. 

అంతకుముందు కొత్త గూడెం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగ రామకృష్ణ కుమార్తె సాహితిని పరామర్శంచారు. అనంతరం పాల్వంచలో విలేకరులతో మాట్లాడుతూ, రాఘవేంద్రరావు అరాచకాలను పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని మండిపడ్డారు. 

Gas leake: పాల్వంచలో కూతురుతో పాటు తల్లిదండ్రులు సజీవ దహనం

ఇదిలా ఉండగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పాత palvancha పట్టణంలోని తూర్పు బజారులో ఒకే కుటుంబంలో ముగ్గరు Suicide పాల్పడిన ఘటనపై కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama venkateswara raoతనయుడు Vanama Raghavendra పై పోలీసులు జనవరి మూడున కేసు నమోదు చేశారు. రాఘవేంద్ర కోసం గాలింపు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు.

పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసం ఉండే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి దంపతులతో పాటు కవలలు సాహిత్య, సాహితిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.   ఈ ఘటనలో Ramakirishna  Srilaxmi , sahitya లు మరణించారు.

ఈ ఘటనలో  80 శాతం కాలిన గాయాలతో ఉన్న sahiti ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. తన చావుకు తన తల్లి, సోదరితో పాటు ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్ర కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే  తనయుడు రాఘవేంద్ర వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టుగా రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు.  గతంలో ఓ కేసులో ముందస్తు బెయిల్ తో రాఘవేంద్ర బయటుకు వచ్చాడు. అయితే ప్రస్తుతం మరోసారి రామకృష్ణ  తన కుటుంబంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై  రాఘవేంద్ర పై మరో కేసును నమోదు చేశారు  పోలీసులు.

పాల్వంచలో గతంలో రామకృష్ణ మీ సేవా కేంద్రం నిర్వహించేవారు.  రెండు నెలల క్రితం ఈ మీ సేవా కేంద్రాన్ని రామకృష్ణ అమ్మేశాడు.  ఆ తర్వాత ఆయన రాజమండ్రికి నివాసాన్ని మార్చాడు. రెండు రోజుల క్రితం రామకృష్ణ, భార్య పిల్లలతో కలిసి పాల్వంచకు వచ్చాడు. ఆదివారం నాడు రాత్రి కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో చిన్నారి సాహితి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios