Asianet News TeluguAsianet News Telugu

సోషల్ వేల్పేర్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌పై ఆరోపణలు చేసిన వ్యక్తిపై దాడి

 తెలంగాణ సోషల్ వేల్పేర్ డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని సోమాజీగూడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీఎస్టీ పరిరక్షణ కమిటీ నేత కర్నె శ్రీశైలంపై  స్వేరో సభ్యులు దాడికి దిగారు.

unknown persons attaked on k.srishailam at press club in hyderabad
Author
Hyderabad, First Published May 21, 2019, 4:55 PM IST

హైదరాబాద్: తెలంగాణ సోషల్ వేల్పేర్ డైరెక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్రమాలకు పాల్పడ్డారని సోమాజీగూడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎస్పీఎస్టీ పరిరక్షణ కమిటీ నేత కర్నె శ్రీశైలంపై  స్వేరో సభ్యులు దాడికి దిగారు.

మంగళవారం నాడు ఎస్సీ, ఎస్టీ పరిరక్షణ కమిటీ నేత కర్నె శ్రీశైలం సోమాజీ గూడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశం జరుగుతున్న సమయంలోనే స్వేరో సభ్యులు శ్రీశైలంపై పిడి గుద్దులు గుద్దారు. 

ఈ దాడిని అడ్డుకొనే ప్రయత్నం చేసిన మీడియా ప్రతినిధులపై కూడ దాడికి దిగారు.తనపై జరిగిన దాడిపై పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో  కర్నె శ్రీశైలం ఫిర్యాదు చేశారు. తనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గీయులు దాడికి దిగారని శ్రీశైలం దాడి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios