తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం నాడు లేఖ రాశారు. రైల్వే ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేనందునే ఆలస్యం అవుతున్నాయని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి KCR కు కేంద్ర మంత్రి Kishan Reddy సోమవారం నాడు లేఖ రాశారు. రాష్ట్రంలో అమలౌతున్న రైల్వే ప్రాజెక్టు లకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనందువల్లే ఆలస్యం అవుతుందని లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Add Asianetnews Telugu as a Preferred Source

Railway ప్రాజెక్టు ల విషయంలో తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతుందని టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కిషన్ రెడ్డి ప్రకటించారు.2014 - 15 లో రూ. 250 కోట్లు ఉన్న బడ్జెట్ 2021- 22లో రూ.2420 కోట్లకు చేరిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. Telangana కు కేంద్రం కేటాయించిన నిధులను లేక్కల తో సహా లేఖలో కిషన్ రెడ్డి ప్రస్తావించారు.