తన కోరిక తీర్చలేదని.. కోడలి గొంతు కోసి చంపిన మామ
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లాతండాలో దారుణం జరిగింది. లైంగిక వాంఛ తీర్చాలని మూడేళ్లుగా వెంటపడుతున్నా.. కోడలు తిరస్కరిస్తుండటంతో కక్ష పెంచుకున్నాడు మామ. దారుణంగా కోడలి గొంతు కోసి హత్య చేశాడు ఓ మామ. ఆ తరువాత నేరుగా వెళ్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. సభ్య సమాజం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. తండ్రి తరువాత తండ్రిలా చూసుకోవాల్సిన మమా.. ఓ వివాహిత పాలిట కాల యముడు లా మారాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని మూడేళ్లుగా వెంటపడుతున్నా.. ఆమె తిరస్కరిస్తుండటంతో కక్ష పెంచుకున్నాడు. దారుణంగా కోడలి గొంతు కోసి హత్య చేశాడు ఓ మామ. ఆ తరువాత నేరుగా వెళ్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం శివారులోని సోమ్లాతండాలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసుల కథనం ప్రకారం.. కురవి మండలంలోని సోమ్లాతండాకు భూక్యా సంతోష్, రజిత దంపతులు. వీరికి పెళ్లై..12 ఏండ్లు అవుతోంది. వీరికి వీరికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరూ ముత్యాలమ్మగూడెంలోని గురుకులంలో చదువు కుంటున్నారు. అయితే.. భూక్యా సంతోష్ తండ్రి భూక్యా హచ్చా (63) ఆయన కూడా వీరితోనే ఉంటాడు. గత మూడేండ్లుగా మ భూక్యా హచ్చా.. కోడలు రజితను తన లైంగిక వాంఛ తీర్చాలని వేధిస్తోన్నాడు. ఈ విషయాన్ని రజిత తన తల్లి దండ్రులతో చెప్పగా వారు పలుమార్లు హచ్చను మందలించారు.
Read Also: jharkhand bus Accident: జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి..
ఈ మధ్య మరో సారి భూక్యా హచ్చా తన కోడలు రజితను లైంగికంగా వేధించాడు. ఈ సారి రజిత తల్లిదండ్రులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో రజితపై కక్ష పెంచుకున్నాడు హచ్చ. అనువైన సమయం కోసం వేయిట్ చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న రజితను బలవంతం చేయబోయాడు. ఆమె తిరస్కరించడంతో పక్కనే ఉన్న రాడ్ తో రజిత తలపై గట్టిగా బాదాడు. అంతటితో ఆగకుండా.. కత్తితో గొంతు కోసి, కడుపులో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె చనిపోయిందని నిర్ధారిం చుకున్న తరువాత నేరుగా పోలీస్స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. మృతురాలి తండ్రి చంద్రు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాణా ప్రతాప్ తెలిపారు. కాగా, హత్య సమయంలో రజిత భర్త కూలి పనికి వెళ్లినట్లు తండా వాసులు తెలిపారు.
తండాలో తీవ్ర ఉద్రిక్తత..
హత్య విషయం తెలుసుకున్నరజిత బంధువులు ఆగ్రహ ఆవేశాలతో సోమ్లాతండాకు తరలివచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కోపోద్రిక్తులై ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కురవి ఎస్సై రాణాప్రతాప్, రూరల్ సీఐ రవికుమార్లు వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని తరలించడానికి వారు అంగీకరించలేదు. భూక్యా హచ్చ, మృతురాలి భర్తను తీసుకొస్తేనే మృతదేహాన్ని తీసుకెళ్లనిస్తామని పోలీసులతో వాదనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు మృతదేహాన్ని బలవం తంగా ట్రాక్టర్లో వేసి పోస్టుమార్టం నిమిత్తం మానుకోటకు తరలించారు. అగ్నిమాపక వాహనం వచ్చేసరికి మొత్తం కాలిపోయింది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో తండాలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.