హైదరాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, 8 మందికి గాయాలు..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఘట్కేసర్ నుంచి వస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టి ఎదురుగా మీర్పేట్ నుంచి వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 8 మందికి గాయాలయ్యాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక, ఘట్కేసర్ నుంచి వస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.