Asianet News TeluguAsianet News Telugu

మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి భార్యకు రూ.11కోట్ల టోకరా.. ఇద్దరు అరెస్ట్..!


ఓ కంపెనీ వ్యవహారంలో 1 శాతం షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆయన కుటుంబానికి తెలియకుండానే ముంబైకి చెందిన కంపెనీ షేర్‌లను అమ్మేసుకుంది

Two held For duping Former Union Minister T subbarami reddy wife Shares
Author
Hyderabad, First Published Nov 9, 2021, 9:28 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యు డు టి.సుబ్బిరామిరెడ్డి ఫ్యామిలీని.. ఓ ముఠా టోకరా ఇచ్చింది. మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డిని ముంబైకి చెందిన ఓ కంపెనీ భారీ మోసం చేసింది. ఏకంగా 11 కోట్ల రూపాయల విలువ చేసే షేర్ల వ్యవహారం లో.. టి సుబ్బిరామి రెడ్డి భార్యని బురిడీ కొట్టించింది. 

Also Read: హైకోర్టు బెయిల్ మంజూరు: జైలు నుండి విడుదలైన తీన్మార్ మల్లన్న

ఓ కంపెనీ వ్యవహారంలో 1 శాతం షేర్ల బదిలీకి సుబ్బిరామిరెడ్డి భార్య ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఆయన కుటుంబానికి తెలియకుండానే ముంబైకి చెందిన కంపెనీ షేర్‌లను అమ్మేసుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సబ్బిరామిరెడ్డి.. ఛాంపియన్‌ పిన్స్‌ లిమిటెడ్‌కు చెందిన చేతన్‌ బాలుబాయి పటేల్‌ (48), హర్షవర్ధన్‌ అవినాష్‌ ప్రధాన్‌ (40) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకువచ్చి నాంపల్లి కోర్టులో హాజరు పర్చారు. వీరిద్దరిని జ్యూడీషియల్‌ కస్టడికి తరలించారు. అయితే సుబ్బరామిరెడ్డి కుటుంబానికి రూ. 11 కోట్ల నష్టం వాటిల్లింది.

Also Read: ఖబర్దార్ కేసీఆర్.. నీ భాష మార్చుకో.. మాకూ నోరుంది.. బీజేపీ నేత డీకే అరుణ ఫైర్

కాగా, జూలై 20న హైదరాబాద్‌లోని గాయత్రి ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ (జీపీఎల్‌) ప్రమోటర్‌, చైర్‌పర్సన్‌ శ్రీమతిరెడ్డి నుంచి తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు. అయితే వాళ్లను నమ్మి దాదాపు రూ.33.05 కోట్ల విలువ చేసే షేర్లపై రూ.11,50,63,575 రుణం తీసుకునేందుకు అంగీకరించారు. రుణం పొందడానికి చివరికి జీపీఎల్‌ జూన్‌ 17న మాస్టర్‌ లోన్‌ అగ్రిమెంట్‌ ప్రకారం సీఎఫ్‌ఎల్‌తో కేవలం 32,50,000 షేర్లను మాత్రమే తాకట్టు పెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 

ఒప్పందం ప్రకారం తాకట్టు పెట్టిన షేర్లకు రుణ మొత్తాన్ని జూలై 12లోగా జీపీఎల్‌కు బదిలీ చేయాల్సి ఉంది. కానీ సీఎఫ్‌ఎల్‌ లోన్‌ మొత్తంలో ఎలాంటి డబ్బు జీపీఎల్‌కు బదిలీ చేయలేదు. జూలై 8న సీఎఫ్‌ఎల్‌ తాకట్టు పెట్టిన షేర్లను చట్టవిరుద్దంగా ప్రవేశపెట్టిన బహిరంగ మార్కెట్‌లో విక్రయించినట్లు తేలింది. తమకు మోసగించిన వారిపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని సుబ్బిరామిరెడ్డి భార్య పోలీసులను అభ్యర్థించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios