తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల  చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీని చేపడతామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే. దీంతో విద్యార్ధులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

తెలంగాణలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల  చేసింది. మొత్తం 503 పోస్టుల భర్తీని చేపడతామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇదే. దీంతో విద్యార్ధులు, నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మే 2 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

ఖాళీలు, పోస్టుల వివరాలు:

డిప్యూటీ కలెక్టర్లు - 42
డీఎస్పీ - 91
సీటీవో - 48
ఎంపీడీవో - 121
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ - 48
రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ - 04
జిల్లా పంచాయత్ ఆఫీసర్ - 05
జిల్లా రిజిస్ట్రార్ - 05
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ - 26
మున్సిపల్ కమీషనర్లు - 41
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు : 40

కాగా.. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇంటర్వ్యూను రద్దు చేసిన సంగతి తెలిసిందే. తొమ్మిది నెలల్లోనే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి  పోస్టింగ్ లు ఇవ్వాలని కూడా కమిషన్ భావిస్తుంది. ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించడంతో గ్రూప్ -1 పరీక్షా విధానంలో కూడా మార్పులు చేయనున్నారు. 900 మార్కుల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. గతంలో గ్రూప్ -1 కేటగిరిలో లేని విభాగాల పోస్టులను ఈ దపా గ్రూప్ 1 లో చేర్చారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్ర కేడర్ పోస్టులు మల్టీ జోనల్ స్థాయికి మారాయి. 

ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో 80,039  ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ఆదేశాల మేరకు తొలి విడతగా 30,453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవల మరో 3,334 ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మిగతా శాఖల్లోని ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.  

అయితే ఈ ప్రకటన చేసి సుమారు 45 రోజులు అవుతుంది. ఆర్ధిక శాఖ నుండి అనుమతులు తీసుకోవడం వంటి వాటి కోసం నోటిఫికేషన్ జారీ చేయడం ఆలస్యమౌతుందనే అభిప్రాయాలను అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రూప్ 1 పోస్టుల తర్వాత గ్రూప్ -2  పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.