Hyderabad: టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో ముందస్తుగా అనుకున్న పక్కా పథకం ప్రకారమే పరీక్షలు రాయడంలో నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కళ్లూ తమపైనే పడతాయని ఊహించించిన నిందితులు.. కాస్త తక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా నడుచుకున్నట్టు తెలుస్తోంది.
TSPSC paper leak case: టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారంలో ముందస్తుగా అనుకున్న పక్కా పథకం ప్రకారమే పరీక్షలు రాయడంలో నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అత్యధిక మార్కులు సాధిస్తే అందరి కళ్లూ తమపైనే పడతాయనీ, ఊహించించిన నిందితులు.. కాస్త తక్కువ మార్కులు తెచ్చుకునే విధంగా నడుచుకున్నట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన విషయం ఒకవేళ వెలుగులోకి వస్తే.. తాము దొరక్కుండా అధికారులు, పోలీసులను తప్పుదారి పట్టించే విధంగా నడుచుకునే ప్రయత్నాలు చేసినట్టు మీడియా కథనలు పేర్కొంటున్నాయి.
సంబంధిత మీడియా కథనాల ప్రకారం.. టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడిన నిందితులు పరీక్షల్లో టాప్ మార్కులు సాధిస్తే.. అందరి కళ్లూ తమపైనే ఉంటుందనీ, అసలుకే ఎసరు వస్తుందని భావించినట్టున్నారు. దీనికి అనుగుణంగానే ప్రవీణ్, రాజశేఖర్లు మొదటి నుంచీ తమ ప్రణాళికలను అమలు చేశారు. 103 మార్కులు తెచ్చుకున్న ప్రవీణ్.. తన వ్యక్తిగత వివరాలు నింపే పత్రంలో డబుల్ బబ్లింగ్ చేయడం కూడా ఇందులో భాగమని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
అలాగే, టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్షను కమిషన్ లోని 20 మంది ఉద్యోగులు రాశారు. వారిలో ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు. వీరిలో పలువురికి 100కు పైగా మార్కులు రాగా, షమీమ్కు అత్యధికంగా 127 మార్కులు వచ్చాయి. ఈ ముగ్గురూ (షమీమ్, సురేష్, రమేష్) పరీక్ష పేపర్లను లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్ల నుంచి ముందుగానే ప్రశ్నపత్రాన్ని తీసుకున్నారనే ఆరోపణల క్రమంలో సిట్ సైతం అరెస్టు చేసింది. అయితే, ముందుగానే పరీక్ష పేపర్లు పొందిన వీరికి టాప్ మార్కులు వచ్చే అవకాశం ఉంది, కానీ ఎగ్జామ్ లో టాప్ మార్కులు వస్తే అనుమానం కలుగుతుందని తక్కువ మార్కులు వచ్చే విధంగా పరీక్షలు రాసినట్టు పోలీసులతో పాటు అధికారులు అనుమానిస్తున్నారు.
వీరు ఇలా చేయడానికి సైతం కారణాలు తెర మీదకు వస్తాయి. సాధారణంగా టీఎస్పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షల్లో అయినా 100/100 స్కోర్ వచ్చే మార్కులు లేదా సాధారణంగా కంటే అధికంగా అనుమానం కలిగించే విధంగా మార్కులు సాధిస్తే కమీషన్ విచారణ జరుపుతుంది. కాబట్టి పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులకు ఈ నిబంధనలు తెలుసుకునే, టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులకు అనుమానం రాకుండా క్వాలిఫై మార్కులు సాధించే విధంగా పరీక్ష రాసినట్టు భావిస్తున్నారు. ఇందులో ప్రధాన నిందితుడు ప్రవీణ్కు 103 మార్కులు కానీ, చివరి నిమిషంలో భయపడిపోయి.. కానీ వ్యక్తిగత వివరాలు నింపే షీట్లో డబుల్ బబ్లింగ్ చేయడంతో అనర్హుడు కావడం వెనుక కూడా వీరి వ్యూహాత్మక ప్రణాళికలు ఉన్నాయని అనుమానిస్తున్నారు.
గ్రూప్ 1 పరీక్షతో పాటు టౌన్ప్లానింగ్ ప్రశ్నపత్రం లీక్ విషయంలోనూ ప్రవీణ్, రేణుకలు నడుచుకున్న తీరుపై పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారు ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీక్ చేశామని నమ్మించే ప్రయత్నం చేశారు.. కానీ విచారణను మరింత లోతుగా చేయడంతో మిగతా పేపర్ల లీకేజీ విషయం వెలుగులోకి వచ్చింది.