ఓల్డ్ మలక్పేటలోని 26 డివిజన్ లో గురువారం నాడు (డిసెంబర్ 3వ తేదీన) రీ పోలింగ్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.
హైదరాబాద్: ఓల్డ్ మలక్పేటలోని 26 డివిజన్ లో గురువారం నాడు (డిసెంబర్ 3వ తేదీన) రీ పోలింగ్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.
ఈ డివిజన్ నుండి సీపీఐ అభ్యర్ధి పోటీ చేశారు. సీపీఐ అభ్యర్ధి ఎన్నికల గుర్తు కంకి కొడవలికి బదులుగా సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పత్రంలో ముద్రించారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకొంది.
also read:గుర్తులు తారుమారు: ఓల్డ్ మలక్పేటలో పోలింగ్ రద్దు
ఈ విషయాన్ని గుర్తించిన సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథికి ఫిర్యాదు చేశారు.
ఈ డివిజన్ లో పోలింగ్ ను రద్దు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ జరిగిన పోలింగ్ ను రద్దు చేయాలని ఈసీ నిర్ణయం తీసుకొంది. ఇవాళ ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను సీజ్ చేశారు. ఈ డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ స్టేషన్లలో ఈ నెల 3 వ తేదీన రీ పోలింగ్ నిర్వహించనున్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 1, 2020, 12:45 PM IST