తెలంగాణలో  ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. 

 హైదరాబాద్: ఈఏపీ సెట్ షెడ్యూల్ మంగళవారంనాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఈ నెల 21న ఈఏపీ సెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 26 నుండి ఏప్రిల్ 6 వరకు ఈఏపీ సెట్ ధరఖాస్తులు స్వీకరించనున్నారు. మే 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

also read:నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్

ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని సెట్ కన్వీనర్ డీఎన్ కుమార్ చెప్పారు.జెఎన్‌టీయూ ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇవాళ నిర్వహించిన సమావేశంలో సెట్ కమిటీ ఈ షెడ్యూల్ ను ఆమోదించిందని డీఎన్ కుమార్ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే ఎంసెట్ పేరును టీఎస్‌ఏపీసెట్ మార్చిన విషయం తెలిసిందే.
మే 6న ఈసెట్, మే 9 నుండి 13వ తేదీ వరకు ఎంసెట్, మే 23న ఎడ్ సెట్, జూన్ 3న లాసెట్, జూన్ 4,5 తేదీల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించిన విషయం తెలిసిందే.