హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తనునిలబెట్టి ఈటల రాజేందర్ ను ఓడిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధీమాను వ్యక్తం చేశారు.
హుజూరాబాద్: హుజూరాబాద్ లో టీఆర్ఎస్ కార్యకర్తనునిలబెట్టి ఈటల రాజేందర్ ను ఓడిస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధీమాను వ్యక్తం చేశారు. శుక్రవారం నాడు ఆయన హుజూరాబాద్లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్నిన్ను ఓ కొడుకులా.. తమ్ముడిలా సీఎం చూసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.
Add Asianetnews Telugu as a Preferred Source

also read:ఈటల రాజేందర్ లేఖంటూ వైరల్: వీణవంక పోలీసులకు బిజెపి ఫిర్యాదు
బీజేపీలోకి ఎందుకు వెళ్లాలో ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ నెల 14వ తేదీన బీజేపీలో ఈటల రాజేందర్ చేరారు. అంతకుముందే ఆయన ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేశారు. త్వరలోనే హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికల కోసం బీజేపీ, టీఆర్ఎస్ లు ఇప్పటినుండే ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ప్రధాన పార్టీలు వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నాయి.
