టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ, హాజరైన కేసీఆర్
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన జరుగుతున్నఈ సమావేశానికి ఆపద్ధర్మ సీఎం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ అయ్యింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన జరుగుతున్నఈ సమావేశానికి ఆపద్ధర్మ సీఎం టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హాజరయ్యారు.
మేనిఫెస్టో కమిటీకి ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే మేనిఫెస్టో కమిటీ రూపొందించిన ప్రణాళికకు సీఎం కేసీఆర్ తుది మెరుగులు దిద్దనున్నారు. అనంతరం పాక్షిక మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ వెల్లడించే అవకాశం ఉంది.