నిజామాబాద్ ఎంపీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీపై కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కోరుట్ల: నిజామాబాద్ ఎంపీ కవితపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీపై కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం నాడు ఆయన ఈ విషయమై స్పందించారు. కవితపై అవాకులు చెవాకులు పేలుతున్న మధు యాష్కీ నాలుక కోస్తామని విద్యాసాగర్ రావు హెచ్చరించారు.
కవితపై పిచ్చి మాటలు మాట్లాడడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆడపడుచుపై పిచ్చి మాటలు మాట్లాడకూడదని విద్యాసాగర్ రావు సూచించారు.
కేసీఆర్ కుటుంబం ఆస్తులు విపరీతంగా పెరిగాయని...కవిత కూడ బెంగుళూరులో విల్లాలను కొనుగోలు చేసిందని ఇటీవల మధు యాష్కీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ విమర్శలపై కవిత మధు యాష్కీకి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే.
"
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 4, 2018, 6:14 PM IST