TRS: రేవంత్ రెడ్డి.. ఓ అబద్దాల కోరు..: టీఆర్ఎస్ నాయకులు
MLC Palle Rajeshwar Reddy: రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఒక అబద్దాల కోరు అని మండిపడ్డారు.
Telangana: కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకుల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్రంలోని అన్ని ప్రధాని పార్టీలు వ్యూహరచనలు చేస్తూ.. ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే ఎ.రమేష్ బాబులు తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు సంబంధించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన డబ్బుతోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో స్థానం సంపాదించుకున్నారని ఆరోపించారు.
రైతు ఆత్మహత్యలపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఒక అబద్దాల కోరు అని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. 8వేల మంది రైతులు ఆత్మహత్యలతో చనిపోయారని గతంలో రేవంత్ చెప్పారని, అది అబద్ధమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి ఆత్మహత్యకు, మరణానికి తేడా తెలియదంటూ మండిపడ్డారు. వివిధ కారణాల వల్ల రైతు చనిపోతే పథకం (రైతు బీమా) ఆమోదించబడినందున, ఈ పథకం కింద ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుందని టీఆర్ఎస్ నాయకులు వివరించారు.
"వివిధ కారణాల వల్ల మరణించిన 80,000 మందికి పైగా రైతులు వారి బంధువులకు డబ్బు అందించారు" అని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్పై దాడి చేసిన రాజేశ్వర్.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఏ రైతుకైనా లబ్ధి చేకూరుతుందా అని ప్రశ్నించారు. దేశంలోని ప్రజలు కాంగ్రెస్ను, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని టీఆర్ఎస్ నాయకుడు అన్నారు. పనికిమాలిన మాటలు మాట్లాడితే రేవంత్రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు వస్తాయని పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు. ఆయన నోరు తెరిస్తే…పచ్చి అబద్దాలు తప్ప మరేమి రావని మండిపడ్డారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొనుకున్న రేవం త్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నాడని మండిపడ్డారు. చివరకు రేవంత్ చచ్చిపోయినా రైతుబంధు మొత్తం వస్తుందన్నారు. రైతుల గురించి ఏనాడు పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు … ఇప్పుడు మాట్లాడే హక్కు లేదన్నారు.
అంతకుముందు.. ఏడేళ్లలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. 65 ఏళ్లలో రాష్ట్రాన్ని పాలించిన పార్టీలన్నీ రూ. 16 వేల కోట్లు అప్పులు చేస్తే ఏడేళ్లలో రూ. 5 లక్షల కోట్లు అప్పులు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని KCR దివాళా తీయించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం నాడు హైద్రాబాద్ లో టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 8 వేల మంది రైతులు చనిపోయారన్నారు. తెలంగాణ కోసం 1500 మంది ఆత్మార్పణం చేసుకున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చారన్నారు. కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకు వచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు.