తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ కే ప్రజలు పట్టం కట్టనున్నారు. అయితే సీట్లు తగ్గనున్నాయి. కాంగ్రెస్ గతంలో పోలిస్తే సీట్లు పెరుగుతాయి. బీజేజీకి కూడా ఓటు బ్యాంకు పెరుగుతాయి. ఆ పార్టీ నుంచి గెలుపొందే ఎమ్మెల్యేల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ విషయాలన్నీ ‘ఆత్మ సాక్షి’ తన తాజా సర్వేలో వెల్లడించింది. 

తెలంగాణ రాష్ట్రంలో కారు జోరు త‌గ్గ‌లేదు. వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించినా టీఆర్ఎస్ అధికారం చేప‌ట్టే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్నంత మెజారీటీ మాత్రం ద‌క్క‌క‌పోవ‌చ్చు. కాంగ్రెస్ కొంచెం బ‌ల‌ప‌డే అవ‌కాశాలు క‌న‌పిస్తున్నాయి. బీజేపీ మూడో స్థానంలో నిల‌వ‌నుంది. టీఆర్ఎస్ కు పోటీ కాంగ్రెస్సే అని ప్ర‌జ‌లు ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారు. ఈ విష‌యాలు అన్నీ ‘ఆత్మసాక్షి’ గ్రూప్ వెల్లడించింది.  ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా స‌ర్వే నిర్వ‌హించింది. జ‌నం నాడి ఏంటో తెలుసుకుంది. ఆ స‌ర్వే ఫ‌లితాల‌ను తాజాగా విడుద‌ల చేసింది. 

ఈ స‌ర్వేలో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. తెలంగాణ‌లో గులాబీ పార్టీకి ఈ సారి 39.5 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని అంచనా వేసింది. అంటే 56 నుంచి 59 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలుచుకుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగే అవ‌కాశం ఉంది. 31.5 శాతం ఓట్లు వ‌స్తాయి. 37 నుంచి 39 ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుంచి గెలుపొందుతారు. అలాగే బీజేపీకి కూడా ఓటు శాతం పెరిగి, సీట్లు కూడా పెరుగుతాయి. క‌మ‌లం పార్టీకి 21 శాతం ఓట్లు ప‌డే అవకాశం ఉంది. దీని ప్ర‌కారం 14 నుంచి 16 ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలుస్తారు. 

వివాహిత తాళిని తీయడం మానసిక క్రూరత్వానికి నిదర్శనం.. మద్రాస్ హై కోర్టు

కొన్ని జిల్లాల్లో గులాబీ - హ‌స్తం శ్రేణుల మ‌ధ్య ప్ర‌ధాన పోటీ ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే మ‌రి చోట్ల అధ‌నంగా క‌మ‌లం పార్టీ కూడా వీటికి పోటీ ఇవ్వ‌నుంది. అంటే మూడు పార్టీల మ‌ధ్య పోరు ఉండ‌నుంది. ఎంఐఎం కు 2.75 శాతం ఓట్లు, మిగితా వారికి 3.25 శాతం ఓట్లు ప‌డ‌నున్నాయి. ఆత్మ‌సాక్షి గ్రూప్ ఈ స‌ర్వే నిర్వ‌హించే స‌మ‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టించింది. దాదాపు 1.88 ల‌క్ష‌ల మంది అభిప్రాయాల‌ను సేక‌రించింది. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు, ధ‌ర‌ణి, వ‌డ్ల కొనుగోలు, ఎంప్లాయిమెంట్, శాంతి, అడ్మినిస్ట్రేష‌న్, పరిపాల‌న తీరు వంటి 40 అంశాల‌పై ప్ర‌శ్న‌లు రూపొందించామ‌ని ఆత్మసాక్షి గ్రూప్ సంస్థ సీఈవో మూర్తి తెలిపారు. తాము ఇంత వ‌ర‌కు 18 రాష్ట్రాల్లో ఇలా స‌ర్వేలు చేశామ‌ని చెప్పారు. అయితే అందులో 16 రాష్ట్రాలు త‌మ స‌ర్వే ఫ‌లితాలు నిజం అయ్యాయ‌ని తెలిపారు. కేవ‌లం రెండు రాష్ట్రాల్లో మాత్ర‌మే అంచ‌నాలు త‌ప్పాయ‌ని పేర్కొన్నారు. ఈ స‌ర్వే మొత్తం జూన్ 30వ తేదీ నాటికి పూర్త‌య్యింది. కాగా ఈ స‌ర్వే ఫ‌లితాల‌ను గురువారం రిలీజ్ చేశారు. 

టీఆర్ఎస్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన ద‌ళిత బంధు ప‌థ‌క‌మే ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ను దూరం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ ప‌థ‌కం అంద‌రికీ అంద‌క‌పోవ‌డం వ‌ల్ల ఇంత‌కు ముందుతో పోలిస్తే ఇప్పుడు 1.5 శాతం మంది ద‌ళితులు గులాబీ పార్టీకి దూరంగా జ‌రిగారు. అయిన‌ప్పటికీ ఎక్కువ సంఖ్యంలో ఆ వ‌ర్గం ప్ర‌జ‌లు కారుకే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. కానీ గిరిజ‌నులు అధికార పార్టీకి దూరం అవుతున్నారు. ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు అందుకుంటున్న వృద్దులు, రైతులు, యాద‌వులు, ఇత‌ర చేతి వృత్తులపై ఆధార‌ప‌డే ప్ర‌జ‌లు అధికార పార్టీవైపే సానుకులంగా ఉన్నారు. కానీ ఉద్యోగ వ‌ర్గాల్లో కొంత వ్య‌తిరేక‌త ఏర్ప‌డింద‌ని స‌ర్వేలో తేట‌తెల్లమ‌య్యింది.

అధిష్టానం వద్దకు వికారాబాద్ టీఆర్ఎస్ పంచాయితీ: సునీత మహేందర్ రెడ్డి, ఆనంద్ లకు కేటీఆర్ ఫోన్

వ‌డ్లు కొనుగోలు లేట్ అవ‌డం, ఇంధ‌న ధ‌ర‌ల పెరుగుదల‌కు కేంద్ర ప్ర‌భుత్వంలో అధికారం ఉన్న బీజేపీయే కారణమవుతోందని చాలా మంది తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సర్వే తెలిపింది. విభజన హామీలను కేంద్రం సరిగా నెరవేర్చలేదని ఓటర్లు అనుకుంటున్నారు. బీజేపీ హిందూ నినాదం ప్ర‌భావం రాజధాని హైదరాబాద్, నిజామాబాద్ లోని ఐదు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో  క‌నిపిస్తుంద‌ని పేర్కొంది. దివంగ‌త సీఎం వైస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కూతురు శ‌ర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ వ‌ల్ల ఉమ్మ‌డి ఖమ్మం, న‌ల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కు కొంత న‌ష్టం చేకూరే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అలాగే ఉమ్మ‌డి నిజామాబాద్, ఆదిలాబాద్, హైద‌రాబాద్ సిటీల్లో బీజేపీకి మ‌ద్ద‌తు పెరిగింది. ఆయా జిల్లాల్లో కాషాయ పార్టీకి ఓటు బ్యాంకు పెరిగింది. అయినా ఇక్క‌డ కూడా కాంగ్రెస్ పోటీ ఇచ్చే అవ‌కాశం ఉండ‌టంతో త్రిముఖ పోరు నెల‌కొంటుంది. అలాగే న‌ల్గొండ, ఖ‌మ్మం, మెద‌క్, వ‌రంగ‌ల్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ల‌లో కారు-హ‌స్తం మ‌ధ్యే పోటీ ఉండ‌నుంది.