Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ఎస్ తోక ముడిచి పారిపోయింది.. రేవంత్ ఫైర్

  • మీరు తోకముడిచి పారిపోయినా వదలం
  • మీ అవినీతి మొత్తాన్ని బయటపెడతాం
  • ముక్కు నేలకు రాయాలని సవాల్ చేసి మళ్లీ తోకముడిచారెందుకు?
TRS develops cold feet over a public debate with Revanth

తన సవాల్ ను స్వీకరిస్తున్నట్లు నటించి తర్వాత... టిఆర్ఎస్ పార్టీ తోకముడిచి పారిపోయిందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసిఆర్ చేసిన అవినీతి బండారం బయటపడుతుందన్న భయంతోనే తోక ముడిచారని విమర్శించారు. ఇప్పటికైనా బహిరంగ చర్చలో మాట్లాడే దమ్ము మాకు లేదు.. తోక ముడిచామని టిఆర్ఎస్ ఒప్పుకుంటే మంచిదన్నారు. 24 గంటల విద్యుత్ కొనుగోళ్లలో తాను చెప్పకుండా మిగిలిపోయిన అవినీతి బండారం మొత్తాన్ని రేపు పాత్రికేయుల స‌మావేశంలో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ఈమేరకు రేవంత్ రెడ్డి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అందులోని మరిన్ని అంశాలివి.

విద్యుత్  రంగంలో జ‌రిగిన అవినీతిపై అవాస్త‌వాలు మాట్లాడుతున్నామ‌ని ద‌మ్ముంటే బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరిన పాల‌క‌ప‌క్షం మేము కూడా బ‌హిరంగ చ‌ర్చ‌కు సై అనేస‌రికి తోక‌ ముడిచి పారిపోయింది. విద్యుత్ ఉత్ప‌త్తి, కొత్త ప్లాంట్ల నిర్మాణం, విద్యుత్ కొనుగోళ్ల‌లో జ‌రుగుతున్న అవినీతిని మేము ఎత్తిచూప‌డంతో టీఆర్ఎస్ నేత‌లు బాల్క స‌మ‌న్‌, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, భాను ప్రసాదరావు ఆవేశంగా ఊగిపోయారు.

రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్ర‌చారం చేస్తున్నాడు, అన్నీ అప‌ద్ధాలు చెబుతున్నాడంటూ మ‌మ్మ‌ల్ని బ‌హిరంగ చ‌ర్చ‌కు ర‌మ్మంటూ పిలిచారు. మాది త‌ప్ప‌ని తేలితే మేము ముక్కును నేల‌కు రాస్తాము.. రేవంత్ రెడ్డి చెబుతున్న‌ది త‌ప్ప‌ని తేలితే ఆయ‌న అబిడ్స్ సెంట‌ర్‌లో ముక్కును నేల‌కు రాయాలి.. అంటూ స‌వాల్ చేయ‌డం మీకు తెలిసిందే. మేము ఈ స‌వాల్‌ను స్వీక‌రించి నేను, నాతో పాటు ఎమ్మెల్యే సంప‌త్ కుమార్‌, టిపిసిసి అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్‌తో క‌లిసి  12వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు చ‌ర్చ‌కు వ‌స్తాము, మీ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు ర‌మ్మ‌న్నా, ఇంకెక్క‌డికి ర‌మ్మ‌న్నా రావ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించాము.

అయితే నిన్న ద‌మ్ముంటే రేవంత్ రెడ్డి బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ చేసిన వారు ఈ రోజు  రేవంత్ రెడ్డితో చ‌ర్చించేది లేద‌ని మాట మార్చేశారు. వారి బండారం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని భ‌య‌ప‌డి పారిపోయారు. విద్యుత్ రంగంలో అన్నింటా అవినీతికి పాల్ప‌డుతున్న పాల‌క‌ప‌క్షం ప‌లాయ‌న‌వాదం ఎత్తుకున్నా వారు చేసిన అవినీతి, అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెట్టేవ‌ర‌కూ వ‌దిలేది లేదు. దీనిలో భాగంగానే రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌కు గాంధీభ‌వ‌న్‌లో  ప‌త్రికా విలేఖ‌రుల స‌మావేశాన్ని నిర్వ‌హిస్తాం, వారి అవినీతి తాలూకు మరిన్ని ఆధారాల‌ను బ‌య‌ట‌పెడ‌తామ‌ని తెలియ‌జేసుకుంటున్నాము.

Follow Us:
Download App:
  • android
  • ios