సింగరేణిలో సోమవారం బొగ్గుగని కూలిన ఘటన విషాదాంతంగా ముగిసింది. ముగ్గురు మృతదేహాలను బుధవారం తెల్లవారుజామును రెస్క్యూ టీం వెలికి తీసింది. దీంతో ఈ ప్రమాదంలో చిక్కుకున్న మొత్తం ఆరుగురిలో ముగ్గురు సురక్షితంగా బయటపడినట్టయ్యింది.

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా ramagundam-3 పరిధిలోని Singareni భూగర్భ గనిలో పైకప్పు కూలిన ఘటన విషాదాంతమైంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లాంగ్ వాల్ ప్రాజెక్టు (ఏఎల్ సీ)బొగ్గుగనిలో సోమవారం మధ్యాహ్నం పైకప్పు కూలడంతో ఇద్దరు అధికారుల సహా ఆరుగురు ఉద్యోగులు చిక్కుకున్నారు. ఇందులో ఇద్దరు అదే రోజు రాత్రి సురక్షితంగా బయటపడగా... సేఫ్టీ మేనేజర్ జయరాజ్,  గని అసిస్టెంట్ మేనేజర్ చైతన్య తేజ, బదిలీ వర్కర్ రవీందర్, ఒప్పంద కార్మికుడు తోట శ్రీకాంత్ చిక్కుకున్నారు.  

వీరిలో రవీందర్ ను మంగళవారం సాయంత్రం సిబ్బంది కాపాడారు. గనిలో చిక్కుకున్న మిగిలిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగించగా బుధవారం ఉదయం చైతన్యతేజ, జయరాజ్, శ్రీకాంత్ మృతిచెందినట్లు గుర్తించారు. ఆ తర్వాత వారి మృతదేహాలను వెలికి తీసి సింగరేణి ఆస్పత్రికి తరలించారు.

కాగా, సోమవారం మధ్యాహ్నం Ramagundam సింగరేణిలో పై కప్పు కూలింది.ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని నలుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. singareni ఆండ్రియాల రాంగ్ వాల్ ప్రాజెక్టులో coal mine పైకప్పు సోమవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు శిధిలాల కింద చిక్కుకున్నారు. అయితే నలుగురు మృతి చెందారని మొదట అనుకున్నారు. కాకపోతే అందులో ఒకరు మంగళవారం సురక్షితంగా బయటపడగా.. మిగిలిన ముగ్గురు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ అహర్నిశలు ప్రయత్నించింది. 

ఇదిలా ఉండగా, రామగుండం-3 బొగ్గు గని పైకప్పు కూలి ఒక అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కేసీఆర్ ఘటనపై ఆరా తీశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కేసీఆర్ సూచించారు. 

సహాయక చర్యలు చేపట్టామని, శిథిలాల నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు శ్రీధర్ సీఎంకు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా తెలియరాలేదని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని కేసీఆర్‌కు తెలియజేశారు.పెద్దపల్లి జిల్లా రామగుండం-3 పరిధిలోని అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో సోమవారం మధ్యాహ్నం సైడు పైకప్పు కూలడంతో ఒక అధికారి సహా నలుగురు కార్మికులు చిక్కుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం హుటాహుటిన సహాయక చర్చలు చేపట్టింది. 

దీనిలో భాగంగా రాత్రి 7 గంటల ప్రాంతంలో ఇద్దరు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. మరో ముగ్గురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా.. ఘటనాస్థలానికి కొద్ది దూరంలో పనిచేస్తున్న సపోర్టుమెన్ కార్మికుడు వీరయ్య స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటకు చేరుకున్నారు. ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.