Telangana: హైదరాబాద్లో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. వారం రోజుల వ్యవధిలో నిర్వహించనున్న రెండో ప్రధాన మతపరమైన ఊరేగింపు కావడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.
Hanuman Jayanthi procession: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని శనివారం నిర్వహించనున్న ఊరేగింపు నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. హనుమాన్ జయంతి ఊరేగింపు 12 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. ఆదివారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యే ప్రధాన శోభాయాత్ర గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై సికింద్రాబాద్ హనుమాన్ మందిర్ తాడ్బన్ వరకు సాగుతుంది. ఈ ఊరేగింపు కొనసాగే మార్గాలు వరుసగా ఇలా ఉన్నాయి.. గౌలిగూడ రామమందిరం, పుత్లిబౌలి ఎక్స్ రోడ్లు, ఆంధ్రా బ్యాంక్ ఎక్స్ రోడ్లు, కోటి, తిలక్ రోడ్, సుల్తాన్ బజార్ ఎక్స్ రోడ్లు, రామ్ కోటి ఎక్స్ రోడ్లు, కాచిగూడ ఎక్స్ రోడ్లు, వీర్ సావర్కర్ విగ్రహం, నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి ఎక్స్ రోడ్లు , RTC 'X' రోడ్లు, అశోక్ నగర్, గాంధీ నగర్, వెనుక వైపు వైస్రాయ్ హోటల్, ప్రాగా టూల్స్, కవాడిగూడ, బన్సీలాల్ పేట్ గ్రేవ్ యార్డ్స్, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, బాటా షో రూమ్, ఉజ్జయిని మహంకాళి టెంపుల్, రాంగోపాల్ పేట్ PS, ప్యారడైజ్ X రోడ్స్, CTO జంక్షన్, రాయల్ లీ ప్యాలెస్, బ్రూక్బాండ్, ఇంపీరియల్ గార్డెన్, మస్తాన్ కాస్ఫే, హనుమాన్ మందిర్ తాడ్బన్.
కర్మన్ఘాట్ హనుమాన్ దేవాలయం (రాచకొండ కమిషనరేట్ పరిధి) నుండి ప్రారంభమయ్యే మరో ఊరేగింపు డిఎంఅండ్ హెచ్ఎస్, ఉమెన్స్ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది. ఇది చంపేట్ వద్ద హైదరాబాద్ పరిమితుల్లోకి ప్రవేశిస్తుంది. ప్రధాన ఊరేగింపులో కలవడానికి ముందు ఈ క్రింది మార్గంలో కొనసాగుతుంది... చంపాపేట్ X Rd - IS సదన్ - ధోభిఘాట్ - సైదాబాద్ కాలనీ రోడ్ - శంకేశ్వర్ బజార్ - సరూర్ నగర్ ట్యాంక్ - రాజీవ్ గాంధీ విగ్రహం , దిల్ సుఖ్ నగర్ - మూసారం బాగ్ జంక్షన్ - మలక్ పేట - నల్గొండ X రోడ్ - అజంపురా రోటరీ - చాదర్ ఘాట్ X రోడ్.

హైదరాబాద్ వాసులు ఆంక్షలను పరిగణనలోకి తీసుకుని తమ రాకపోకలను ప్లాన్ చేసుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. కమ్యూటేటర్లు ఏదైనా ప్రయాణ సమాచారం కోసం ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (040 2785 2482) మరియు ట్రాఫిక్ హెల్ప్ లైన్ (9010203626)ని కూడా సంప్రదించవచ్చని సూచించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో జరిగే శోభాయాత్రకు హైదరాబాద్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్న నేపథ్యంలో ఊరేగింపు కోసం పోలీసులు విస్తృతమైన భద్రతా ప్రణాళికను రూపొందించారు. శాంతిభద్రతలు, భద్రతా ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని, ఇతర ప్రభుత్వ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఎస్హెచ్ఓలందరికీ మార్గదర్శకాలు జారీచేయబడ్డాయి. ఒక వారం కంటే తక్కువ సమయంలో నగరంలో జరిగే రెండవ ప్రధాన మతపరమైన ఊరేగింపు కావడం, ఇటీవల జరిగిన శ్రీరామ నవమి శోభయాత్ర సందర్భంగా పలు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
