జనగామ (janagaon) డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (janga raghava reddy ) టీపీసీసీ (tpcc) షోకాజ్ నోటీసులు (show cause notice) జారీ చేసింది. జంగా రాఘవరెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర నాయత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు టీపీసీసీ తెలిపింది. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

జనగామ (janagaon) డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డికి (janga raghava reddy ) టీపీసీసీ (tpcc) షోకాజ్ నోటీసులు (show cause notice) జారీ చేసింది. జంగా రాఘవరెడ్డితో పాటు మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర నాయత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు టీపీసీసీ తెలిపింది. ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

జనగామ మండల, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను జంగా రాఘవరెడ్డి.. పొన్నాల (ponnala lakshmaiah) ప్రమేయం లేకుండా అంతా తన వర్గం వారిని నియమించుకున్నారు. దీంతో ఈ పంచాయితీ పీసీసీ బాస్ రేవంత్ రెడ్డి (revanth reddy) వరకు వెళ్లింది. అయితే రేవంత్.. జంగా చేపట్టిన నియామకాలను రద్దు చేసి.. కొత్తగా పొన్నాల ఇచ్చిన లిస్ట్ ను ఫైనల్ చేశారు. దీంతో ఇరు వర్గాల పంచాయితీ రచ్చకెక్కింది. 

ALso Read:తెలంగాణ కాంగ్రెస్‌లో ‘ఈటల’ చిచ్చు.. భట్టివిక్రమార్క‌పై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం

తాజాగా పార్టీ శిక్షణా తరగతులలో జంగా వర్గీయులు గొడవకు దిగడంతో ఇష్యూ కాస్తా సీరియస్ అయ్యింది. ఈ అంశాన్ని పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించారు. సమావేశంలో మెజారిటీ నాయకులు జంగా రాఘవరెడ్డి చర్యను క్రమశిక్షణ రాహిత్యంగా అభిప్రాయ పడ్డారు. ఇక ఆయనకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.