Asianet News TeluguAsianet News Telugu

కెటిఆర్ పరువు నష్టం దావా: రకుల్, సమంతలను లాగిన రేవంత్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ క్రమంలోనే హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తావన తెచ్చారు రేవంత్. కేటీఆర్‌కు వంద కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా అని ప్రశ్నించారు.

tpcc chief revanth reddy reacts on minister ktr legal notice ksp
Author
First Published Mar 31, 2023, 3:47 PM IST

మంత్రి కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. శుక్రవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌కు వంద కోట్లు ఇస్తే అమ్మనా బూతులు తిట్టొచ్చా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే హీరోయిన్లు సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తావన తెచ్చారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ ఏమైనా రకుల్ ప్రీత్ సింగ్ సినిమాకు సైన్ చేసినట్లా లేక, సమంత సిరీస్‌కు సంతకం పెట్టినట్లా అంటూ సెటైర్లు వేశారు. కేటీఆర్‌ తన పరువు వంద కోట్లు అని ఎలా నిర్ధారించాడని రేవంత్ ప్రశ్నించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ విచారణపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. దమ్ముంటే పేపర్ లీక్ కేసును సీబీఐ, ఈడీకి అప్పగించాలని ఆయన సవాల్ విసిరారు. పబ్లిక్ డొమైన్‌లో లేని సమాచారం కేటీఆర్ వద్దకు ఎలా చేరిందని రేవంత్ రెడ్డి నిలదీశారు. 

కాగా.. టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి , బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లకు  కేటీఆర్ మంగళవారంనాడు  లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. తనపై నిరాధార ఆరోపణలు  చేసినందుకు బహిరంగ క్షమాపణలు  చెప్పాలని  కేటీఆర్ ఆ నోటీసులో  పేర్కొన్నారు. బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే  రూ, 100 కోట్లకు  పరువు నష్టం దావా ఎదుర్కోవాల్సి వస్తుందని  మంత్రి కేటీఆర్ ఆ నోటీసులో  పేర్కొన్నారు. 

Also Read: పరువుకు 100 కోట్లా.. మరి నిరుద్యోగులకి నువ్వెంత కట్టాలి, లీగల్‌గానే వెళ్తా : కేటీఆర్ నోటీసులపై బండి సంజయ్

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్  పేపర్ లీక్ అంశంపై  తనపై  నిరాధారమైన ఆరోపణలు  చేశారని  రేవంత్ రెడ్డి ,  బండి  సంజయ్ లపై కేటీఆర్ మండిపడ్డారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్  లీక్ అంశంలో  మంత్రి కేటీఆర్  కార్యాలయానికి  సంబంధం ఉందని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు. అటు ఈ కేసులో మంత్రి  కేటీఆర్  ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని బండి సంజయ్ డిమాండ్  చేశారు . ఐటీ శాఖను నిర్వహిస్తున్న కేటీఆర్  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్   కేసుకు బాధ్యత వహించాలని  ఈ ఇద్దరూ  నేతలు  డిమాండ్ చేశారు. 

అటు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై ఇప్పటికే స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నీ పరువుకే రూ.100 కోట్లయితే .. 30 లక్షల మంది భవిష్యత్ ప్రశ్నార్ధకమైందన్నారు. మరి వాళ్లకెంత మూల్యం చెల్లిస్తావని బండి సంజయ్ ప్రశ్నించారు. లీకేజ్‌లో తన కుట్ర వుందన్న నీపై ఎంత దావా వేయాలని ఆయన నిలదీశారు. నీ ఊడుత ఊపులకు భయపడే ప్రసక్తే లేదని.. అమెరికాలో చిప్పలు కడిగేటోడికి వేల కోట్లు ఎలా వచ్చాయని బండి సంజయ్ ప్రశ్నించారు. నోటీసులను లీగల్‌గానే ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేపేవరకు పోరాడతామని ఆయన తేల్చిచెప్పారు. లీకేజ్ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందేనని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒక్కో నిరుద్యోగికి రూ.లక్ష ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios