ఫీజు బకాయిలు విడుదల చేయాలి
లేదంటే 24న సీఎం ఇల్లు ముట్టడిస్తాం
అమన్ గల్లులో సభలో టిఎన్ఎస్ఎఫ్ హెచ్చరిక
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందని, సంక్షోభం దిశగా విద్యారంగం పయనిస్తోందని తెలుగు దేశం పార్టీ విద్యార్థి అనుబంధ సంస్థ టిఎన్ఎస్ఎఫ్ విమర్శించింది. సోమవారం పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్ , స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా అమన్ గల్లు లో టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ధర్నా, బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే విద్యార్థి ఫీజు బకాయిలు విడుదల చేయాలని, లేదంటే 24న సీఎం నివాసం ముట్టడిస్తామని హెచ్చరించారు.