Asianet News TeluguAsianet News Telugu

జూన్‌లో పూర్తి వేతనం చెల్లించాలి: టీఎన్‌జీఓ డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ మాసంలో పూర్తి స్థాయి వేతనం ఇవ్వాలని టీఎన్‌జీవో డిమాండ్ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు. దీంతో ఉద్యోగులకు సగం వేతనం మాత్రమే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

TNGO demands to pay full salary for june month to government employees
Author
Hyderabad, First Published Jun 21, 2020, 6:14 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు జూన్ మాసంలో పూర్తి స్థాయి వేతనం ఇవ్వాలని టీఎన్‌జీవో డిమాండ్ చేసింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాలేదు. దీంతో ఉద్యోగులకు సగం వేతనం మాత్రమే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

జూన్ నెల వేతనం పూర్తిగా చెల్లించాలని టీఎన్‌జీఓ రాష్ట్ర అద్యక్షుడు కారం రవీందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా కేసుల తీవ్రత తగ్గిన తర్వాత ఇదే విషయమై సీఎం కేసీఆర్ ను కలవనున్నట్టుగా ఆయన ఇవాళ తెలిపారు.

పూర్తి స్థాయి వేతనాలు చెల్లించే విషయంలో సీఎం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.లాక్‌డౌన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుండి రాష్ట్రంలో లాక్ డౌన్ ఉంది.

మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం మాత్రమే వేతనాలను ఇచ్చారు. మే మాసంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం మాత్రమే ఇచ్చారు.

మార్చి, ఏప్రిల్ మాసాల వేతనాలకు సంబంధించినట్టుగానే మే మాసంలో కూడ ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతాలు మాత్రమే ఇచ్చారు. ఏపీ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇచ్చింది.

 తెలంగాణ రాష్ట్రంలో  ప్రజా ప్రతినిధులు, ఐఎఎస్, ఐపీఎస్ లు, ప్రభుత్వ ఉద్యోగులు నాలుగో తరగతి ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో ప్రభుత్వం కోత విధించింది. 

ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్గం సభ్యులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75% కోత విధించారు. వీరందరికి 25 శాతం వేతనం  మాత్రమే ఇస్తున్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 160 మంది. 

also read:షాకిచ్చిన కేసీఆర్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'మే'లో కూడ సగం జీతమే

ఐఏఎస్,ఐపీఎస్,ఐఎఫ్ఎస్  తరహా ఆలిండియా సర్వీసు అధికారుల వేతనాల్లో 60శాతం కోత పెట్టారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 350 మంది ఉంటారు. 
మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50శాతంకోతవిధిస్తున్నారు. ఈ ఉద్యోగుల సంఖ్య 2.80 లక్షలుగా ఉంటుందని అంచనా.

నాల్గో తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. నాల్గోతరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10శాతం కోత విధిస్తారు. వీరి సంఖ్య: లక్షా 35 వేలుగా ఉంది. 

అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత పెడుతున్నారు. వీరి సంఖ్య: లక్షా 23 వేలుగా ఉంది. అయితే హైకోర్టు తీర్పు మాత్రం పెన్షనర్లకు పూర్తి వేతనం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సాగుతోంది. 

జూన్ మాసంలో పూర్తి స్థాయి వేతనాలు చెల్లించాలని టీఎన్‌జీఓ కోరుతోంది. ఇప్పటికే సగం వేతనాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. ఇటీవల రెవిన్యూ ఉద్యోగి సగం వేతనాలతో పడుతున్న ఇబ్బందికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios