Asianet News TeluguAsianet News Telugu

ఆసిఫాబాద్ జిల్లాలో పులి పంజా.. వృద్ధుడిని చంపి, అడవుల్లోకి ఈడ్చుకెళ్లి

ఆసిఫాబాద్ జిల్లా ఖానాపూర్‌లో ఓ వ్యక్తిపై దాడి చేసిన పులి అతన్ని చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. 

tiger kills man in asifabad district
Author
First Published Nov 15, 2022, 5:41 PM IST

ఆసిఫాబాద్ జిల్లాలో ఓ వ్యక్తిని పులి చంపింది . ఖానాపూర్ సమీపంలో దాడి చేసిన పులి .. అడవిలోకి లాక్కెళ్లింది. మృతుడు ఖానాపూర్‌కు చెందిన భీముగా గుర్తించారు. ఫారెస్ట్ అధికారులు సైతం ఈ ఘటనను ధ్రువీకరించారు. పులి దాడిలోనే అతను చనిపోయినట్లు తెలిపారు. అయితే ఈ ఏరియాలో గత కొన్నిరోజులుగా పులి తిరుగుతోంది. పశువులపై దాడులు చేస్తూ వస్తోన్న పులి.. ఇవాళ ఏకంగా మనిషిని చంపడంతో స్థానికులు భయంతో వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీ, పోలీస్ శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. రెండేళ్ల క్రితం దిగిడలో ఓ వ్యక్తిని పులి చంపేసిన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. పులి కోసం అప్పుడు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios