పోలీస్ వాహనం ఢీ: చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి
పోలీస్ వాహనం ఢీకొట్టడంతో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి మరణించింది. తెల్లవారుజామున పాప చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిన్నారి గుండె పనిచేయకపోవడంతో మరణించిందని తెలిపారు.
పోలీస్ వాహనం ఢీకొట్టడంతో కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి మరణించింది. తెల్లవారుజామున పాప చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. చిన్నారి గుండె పనిచేయకపోవడంతో మరణించిందని తెలిపారు.
నాలుగు రోజుల కిందట యాదాద్రిలో నిద్రిస్తున్న చిన్నారిని రాచకొండ పోలీస్ వాహనం ఢీకొట్టడంతో పాపకు తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి కామినేని ఆసుపత్రిలోనే పాపకు చికిత్స నందిస్తున్నారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ప్రణతి ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచింది.