Asianet News TeluguAsianet News Telugu

మూడేళ్ల బాలుడిపై తల్లి, ప్రియుడు కిరాతకం.. అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని పాశవికం...చికిత్స పొందుతూ మృతి..

మూడేళ్ల బాలుడుని అత్యంత పాశవికంగా హింసించి.. హత్య చేశారు తల్లి, ఆమె ప్రియుడు. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఇంత దారుణానికి తెగించారు. 

Three-year-old boy beaten by mother and boyfriend died in hyderabad
Author
First Published Aug 30, 2022, 7:16 AM IST

హైదరాబాద్ : వావి వరసలు మరిచి.. సోదరుడి వరుసయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఆ తర్వాత తమ ఏకాంతానికి భంగం కలిగిస్తున్నాడనే కోపంతో నవమాసాలూ మోసి.. పేగు తెంచుకు పుట్టిన మూడేళ్ల  బిడ్డను అత్యంత దారుణంగా హతమార్చడానికి సహకరించింది. చిన్నారులు మన పిల్లలు కాకపోయినా.. వారికి మన కళ్లముందు ఏదైనా జరిగితే.. అయ్యో అని బాధపడతాం.. అలాంటిది కన్న కొడుకును ప్రియుడు అతి దారుణంగా హింసించినా క్షణిక సుఖం ముందు.. ఆ తల్లికి ఆ చిన్నారి బాధ తెలియలేదు. అందుకే ఇద్దరూ కలిసి బాలుడిది ప్రమాదం అంటూ నాటకం ఆడారు. 

పోలీసులకు అనుమానం వచ్చి.. దర్యాప్తు చేయడంతో 50 రోజుల తర్వాత వారి గుట్టు రట్టయింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను ముషీరాబాద్  పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన దంపతులు జాతీయ ఉపాధి కోసం నగరానికి వచ్చారు. కొంతకాలంగా రామ్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరికి 5, 3  సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు.పెద్ద కొడుకు స్కూల్ కు వెడుతున్నాడు. చిన్న కొడుకు సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి వెలుతున్నాడు. ఇటీవల భార్యాభర్తలు సొంతూరులో బంధువు అంత్యక్రియలకు వెళ్లారు. ఆ కార్యక్రమానికి వచ్చిన సమీప బంధువు ఒకరు వారితో మాట కలిపాడు. ఆ తరువాత  ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు.  

జనగామలో దారుణం.. చెత్తకుప్పలో చిన్నారి..

కొన్ని రోజుల కొన్ని రోజుల తర్వాత ఉపాధి కోసం నగరానికి వస్తున్నట్లు చెప్పాడు. అలా రామ్ నగర్ లోని దంపతుల వద్దకు మకాం మార్చాడు. భార్యతో అతను సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ ఆమెకు అతను సోదరుడి వరుస కావడంతో భర్త అనుమానించలేదు. అది వారికి కలిసి వచ్చింది. భర్త బయటకు వెళ్ళగానే ఇద్దరు కలుసుకునేవారు. అయితే, చిన్న కుమారుడు మధ్యాహ్నం అంగన్వాడి కేంద్రం నుంచి ఇంటికి వస్తుండటంతో.. వారికి తమ బంధానికి అడ్డంకి అని భావించారు. అలా కాకుండా ఉండాలంటే చిన్నారి అడ్డు తొలగించుకోవాలనుకున్నారు. 

ఆ రోజు ఏం జరిగిందంటే…
గత నెల 28న ఉదయం బాలుడు(3) అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. తర్వాత కాసేపటికే తల్లి ఇంట్లోకి వచ్చింది. బిడ్డ ఆడుకుంటూ కుర్చీ పైనుంచి కింద పడ్డాడు అంటూ 108 వాహనంలో కుమారుడిని గాంధీ ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు. బాలుడి మృతిపై తండ్రి ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు.

చుట్టుపక్కల వారిని ఆరా తీయడంతో…
పోలీసుల దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల వారిని విచారించగా.. బాలుని మృతిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దారుణం వెలుగులోకి వచ్చింది. ‘తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో ఉన్న అతను బాలుడిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. దానికి తల్లి కూడా సహకరించింది. ఆ పథకం ప్రకారం బాలుడు ఇంటికి వచ్చే సమయానికి పనికి వెళ్లి పోయింది.  మధ్యాహ్నం తర్వాత ఇంట్లో బాలుడు ఒంటరిగా ఉన్నాడని తెలిసిన అతను… ఇంట్లోకి వెళ్లి బాలుడిపై దాడి చేశాడు. 

అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. బలమైన  వస్తువును ఆ చిన్నారి మలద్వారంలో దూర్చాడు. పదే పదే పదే కొడుతూ చిత్రహింసలకు గురిచేశాడు. తీవ్రంగా గాయపడిన బాలుడు మూడు సార్లు విరేచనాలు అయ్యాక.. అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బిడ్డను ఆస్పత్రిలో చేర్పించారు’ అని పోలీసుల దర్యాప్తులో తెలుసుకున్నట్లు సమాచారం.  కేసుపై మరింత స్పష్టత వచ్చాక పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios