రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు.
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను ఐచర్ వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మృతులలో ఒక చిన్నారి కూడా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను గోపాల్, అంజలి, చిన్నారి స్వాతిగా గుర్తించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.