Agnipath: పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అగ్నిపథ్ నిరసనకారుడు రాకేష్ అంత్యక్రియల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ర్యాలీలో పాల్గొన్న‌వారు ప్ర‌ధాని మోడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మృతుని అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఘట్‌కేసర్‌లో పోలీసులు మార్గమధ్యంలో అరెస్ట్ చేశారు. 

Agnipath: దేశ‌వ్యాప్తంగా అగ్నిప‌థ్ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్న క్ర‌మంలో సికింద్రాబాద్ లో హింసాత్మ‌కంగా మారిన నిర‌స‌న‌ల్లో రాకేష్ అనే ఆర్మీ అభ్య‌ర్థిని పోలీసుల కాల్చి చంపారు. దీంతో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అగ్నిప‌థ్ నిర‌స‌న‌కారులు ప్ర‌ధాని మోడీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. "ఇది మోడీ ప్రభుత్వ హత్య" అంటూ అగ్నిపథ్ నిరసనకారుడు రాకేష్ అంతిమయాత్రలో పెద్ద ఎత్తున్న నినాదాల హోరు క‌నిపించింది. వరంగల్ రైల్వే స్టేషన్, వరంగల్‌లోని బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంపై ప్రజలు దాడికి ప్రయత్నించడంతో శనివారం మరణించిన అగ్నిపథ్ నిరసనకారుడు డి రాకేష్ అంత్యక్రియల ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. "ఇది మోడీ ప్రభుత్వ హత్య" అని రాకేష్ మరణానికి కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ర్యాలీలోని ప్లకార్డులను ప్ర‌ద‌ర్శించారు. 

Scroll to load tweet…

వరంగల్‌ మహాత్మాగాంధీ మెమోరియల్‌ ఆస్పత్రి వద్ద ప్రారంభమైన ర్యాలీలో వందలాది మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు నల్లరిబ్బన్లు, కండువాలు ధరించి పాల్గొన్నారు. "ఈ కొత్త అగ్నిప‌థ్‌ పథకంతో వారు సంతోషంగా లేనందున అనేక మంది యువకుల జీవితాలను రక్షించడానికి అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను" అని డి రాకేష్ తండ్రి కుమారస్వామి, అతని భార్య మరియు మృతుడి తల్లి పూలమ్మతో కలిసి, ఇద్దరూ కుమారుని మరణంతో శోక‌సంద్రంలో మునిగిపోయారు. వారి క‌న్నీటి రోద‌న‌తో ఆ ప్రాంతంలో విషాదఛాయ‌లు క‌మ్ముకున్నాయి. అగ్నిప‌థ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా నిరసనను చేపట్టడానికి తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువకులలో రాకేష్ ఒకరు. అగ్నిప‌థ్‌ సైన్యంలో చేరాలనే వారి ఆశలను నీరుగార్చేస్తుందని వారు భావించారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా నిన‌దించారు.

మృతుడు తెలంగాణలోని వరంగల్ జిల్లా దబీర్‌పేట గ్రామానికి చెందిన రైతు కుమారుడు. హన్మకొండలో గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్న రాకేష్ ఆరు నెలల క్రితం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికై రాత పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అతడికి తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారు. అతని సోదరి ఆర్మీలో పనిచేస్తున్నారని చెస్తున్నారు. సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల్లో మరణించిన రాకేశ్ సోదరి. బీఎస్ఎఫ్‌లో పనిచేస్తున్న రాణి.. సోదరుడి మరణవార్త తెలుసుకుని స్వస్థలానికి చేరుకున్నారు. తన సోదరుడి మరణంపై ఆయన సోదరి, బీఎస్ఎఫ్ జవాన్ రాణి కన్నీటి పర్యంతమయ్యారు. తనను స్ఫూర్తిగా తీసుకుని రాకేశ్ సైన్యంలో చేరాలని, దేశం కోసం సేవ చేయాలని అనుకున్నాడని రాణి తెలిపారు. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో తన తమ్ముడు తీవ్రంగా ఆందోళన చెందాడని చెప్పారు. ఆర్మీలో తుపాకీ పట్టాల్సినోడు పోలీసుల తుపాకీ గుళ్లకు బలయ్యాడని కంటతడి పెట్టారు.

Scroll to load tweet…