ఇల్లందులో దొంగల బీభత్సం.. సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్పై రాళ్ల దాడి..
భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దొంగలు బీభత్సం సృష్టించారు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో సెక్యూరిటీ స్పెషల్ ఆఫీసర్పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో దొంగలు బీభత్సం సృష్టించారు. సింగరేణి ఓపెన్ కాస్ట్లో సెక్యూరిటీ స్పెషల్ ఆఫీసర్పై రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఓపెస్ కాస్ట్లో చోరికి యత్నించిన దొంగలను సెక్యూరిటీ స్పెషల్ ఆఫీసర్ పట్టుకునేందుకు యత్నించాడు. దీంతో దొంగలు రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనసై సింగరేణి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.