హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ చోరీ జరిగింది. ఓ జ్యుయలరీ షాపులో భారీ ఎత్తున సొత్తు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని చందానగర్ లో భారీ చోరీ జరిగింది. ఓ నగల దుకాణంలోకి చొరబడ్డ దొంగలు భారీ ఎత్తున నగలు అపహరించారు. నగల షాపు పక్కనే ఉన్న బట్టల షాపు గోడకు కన్నం వేసి దుండగులు నగల షాపులోకి ప్రవేశించారు. దీనిమీద సమాచారం అందడంతో పోలీసులు, హైదరాబాద్ క్లూస్ టీం దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Add Asianetnews Telugu as a Preferred Source

