Asianet News TeluguAsianet News Telugu

యూఎస్ఏలో మంచిర్యాల‌కు చెందిన యువ‌కుడి మృతి..

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాలకు చెందిన ఓ యువకుడు అమెరికాలో చనిపోయాడు. ఎంఎస్ చదవడానికి అక్కడికి వెళ్లిన ఆయన గుండెపోటుతో మరణించాడు. 

The death of a young man from Manchiryala in USA..
Author
First Published Sep 2, 2022, 10:04 AM IST

ఉన్న‌త చ‌దువుల కోసం విదేశం వెళ్లిన ఆ యువ‌కుడు అకాల మ‌ర‌ణం చెందాడు. హ‌య్య‌ర్ ఎడ్యుకేష‌న్ పూర్తి చేసి జీవితంలో మంచి ఉద్యోగంలో స్థిర‌ప‌డాల‌ని అనుకున్న ఆ యువ‌కుడి కోరిక నెర‌వేరలేదు. ఆమెరికాకు వెళ్లి ప‌ది రోజుల కూడా ఉండ‌కుండానే హార్ట్ ఎటాక్ తో చ‌నిపోయాడు. తెలంగాణ‌లోని మంచిర్యాల జిల్లాకు చెందిన 26 ఏళ్ల శ‌ర‌త్ కుమార్ న్యూయార్క్ లో బుధ‌వారం చ‌నిపోయారు. 

నల్గొండ జిల్లాలో తప్పిన ప్రమాదం: టైర్ పేలి ప్రైవేట్ బస్సు దగ్ధం, 45 ప్రయాణీకులు సురక్షితం

శ‌ర‌త్ ఆగ‌స్టు 23వ తేదీన యూఎస్ఏలోని న్యూయార్క్ సిటీకి  చేరుకున్నారు. ముందుగా అక్క‌డ ఓ హోట‌ల్ లో స్టే చేశారు. త‌రువాత ఓ రూమ్ కు మారాడు. మంగ‌ళ‌వారం రాత్రి ఆ రూమ్ కు షిప్ట్ అయిన శ‌ర‌త్.. అందులో త‌న వ‌స్తువుల‌ను, బ‌ట్ట‌ల‌ను స‌ర్దుకుంటున్నాడు. ఈ స‌మ‌యంలో హార్ట్ ఎటాక్ వ‌చ్చింది. దీంతో అక్క‌డే ఉన్న స్నేహితులు వెంట‌నే స్పందించారు. హాస్పిట‌ల్ కు తీసుకువెళ్లే స‌మ‌యంలోపే ప‌రిస్థితి విష‌మించి చ‌నిపోయాడు.

వివరణకు మరికొంత సమయం ఇవ్వండి : రాజాసింగ్ భార్య ఉషాబాయి

అత‌డి డెడ్ బాడీని న్యూయార్క్ సిటీలో ఉన్న సెయింట్‌విన్సెంట్స్‌ మెడికల్ సెంట‌ర్ లో ఉంచారు. అత‌డి మృతి విష‌యాన్ని త‌ల్లిదండ్రులకు చేర‌వేశారు. శరత్‌కుమార్ పాత మంచిర్యాల స్టేష‌న్ రోడ్డులో నివాసం ఉండేవాడు. అత‌డి తండ్రి పేరు మల్క తిరుపతి.  ఆయ‌న మంచిర్యాల ఏసీపీ వ‌ద్ద గన్‌మెన్‌గా ప‌ని చేస్తున్నారు. డెడ్ బాడీని మంచిర్యాల‌కు తీసుకువ‌చ్చేందుకు త‌మ‌కు గ‌వ‌ర్న‌మెంట్ స‌హాయం చేయాల‌ని మృతుడి తండ్రి కోరుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios