Asianet News TeluguAsianet News Telugu

మోడీ మళ్లీ ప్రధాని అయిన రోజు దేశ ప్రజలందరికీ సంక్రాంతి - కిషన్‌ రెడ్డి

భారత్ (bharat)కు ప్రధాని (prime minister)గా మూడో సారి మోడీ (modI)నే ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (union minister kishan reddy)అన్నారు. నేడు తెలుగు ప్రజలకు మాత్రమే సంక్రాంత్రి (sankrantri)అని, కానీ ప్రధాని మళ్లీ ప్రధాని అయిన రోజు దేశ ప్రజలందరికీ సంక్రాంతి అని తెలిపారు. 

The day Modi became Prime Minister again is Sankranthri for all the people of the country - Kishan Reddy..ISR
Author
First Published Jan 15, 2024, 2:14 PM IST

kishan reddy : మోడీని మళ్లీ ప్రధానిని చేయాలని దేశ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జహీరాబాద్ లోక్ సభ సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పనితీరుపై ఆయన దృష్టి సారించారని అన్నారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

తెలంగాణలో ఇక నుంచి ‘ఎంసెట్’ మాయం.. ఎందుకంటే ?

ఈ రోజు తెలుగువారికి సంక్రాంతి అని, కానీ మోడీ మూడోసారి ప్రధాని అయిన రోజు దేశ ప్రజలందరికీ సంక్రాంతి అని కిషన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని కాకముందు తెలంగాణలో ఐసిస్ ఏజెంట్లు ఉండేవారని, తరచూ బాంబు పేలుళ్లు జరిగాయని ఆయన ఆరోపించారు. గోకుల్ చాట్, దిల్ సుఖ్ నగర్, లుంబినీ పార్కుల్లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయని ఆయన గుర్తు చేశారు.

రాహుల్ గాంధీని రీలాంచ్ చేసేందుకే భారత్ జోడో న్యాయ్ యాత్ర - బీజేపీ

బొంబాయి వంటి చోట్ల రైళ్లలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్ నుంచి రిమోట్ తో పేలుళ్లు జరిగే పరిస్థితి ఉండేదని తెలిపారు. ఐఎస్ఐ భారత్ ను తన ఆధీనంలో ఉంచుకోవాలనుకుందని చెప్పారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని అన్నారు. మోడీ ప్రధాని అయ్యాక పదేళ్లలో మతకలహాలు లేవని, కర్ఫ్యూలు లేవని తెలిపారు. ఏకే 47లు, ఆర్డీఎక్స్ లు పేలుళ్లు లేవని చెప్పారు.

విషాదం.. మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాను మృతి

రామమందిర నిర్మాణం 500 ఏళ్ల పోరాట ఫలితమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బాబర్ దండయాత్రలు ఆలయాన్ని ధ్వంసం చేశాయని, బాబర్ జ్ఞాపకార్థం బాబ్రీ మసీదును నిర్మించారని తెలిపారు. ఆలయ నిర్మాణం కోసం 1990లో ఎల్ కే అద్వానీ రథయాత్ర చేపట్టారని గుర్తు చేశారు. అప్పటి నుంచి తమ పార్టీ ఆలయం కోసం పోరాడుతూనే ఉందని అన్నారు.

మార్చి 15 వరకు బలగాలను వెనక్కి తీసుకోండి - భారత్ కు మాల్దీవుల అల్టీమేటం..

 ప్రజలు ప్రశాంతంగా ఉండటం కొన్ని పార్టీలకు నచ్చదని, సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే పార్టీలు ఆలయాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి అన్నారు. ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారిపోతోందన్నారు. లోక్ సభ స్థానాలను ఆ పార్టీ తిరిగి గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదని జోస్యం చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios