Asianet News TeluguAsianet News Telugu

పిడుగుపాటుతో ముగ్గురు మృతి.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వ‌ర్షాలు

Telangana: రాష్ట్రంలో పిడుగుపాటు కార‌ణంగా ముగ్గ‌రు ప్రాణాలు కోల్పోయారు. చ‌నిపోయిన ముగ్గురు రైతులు పొలంలో ప‌నిచేస్తుండ‌గా, పిడుగుపాటుకు గుర‌య్యారు.  
 

Telangana : Three dead due to lightning.. Heavy rains are falling in the state
Author
Hyderabad, First Published Aug 4, 2022, 6:35 AM IST

Heavy rains-lightning: తెలంగాణ‌లోని ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక ప్రాంతాల్లో నీటి ఎద్ద‌డి ఏర్ప‌డింది. రాష్ట్రంలో పిడుగుపాటు కార‌ణంగా ముగ్గ‌రు ప్రాణాలు కోల్పోయారు. చ‌నిపోయిన ముగ్గురు రైతులు పొలంలో ప‌నిచేస్తుండ‌గా, పిడుగుపాటుకు గుర‌య్యారు. వివ‌రాల్లోకెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంగళ, బుధవారాల్లో పిడుగుపాటుకు గురై పొలంలో పనిచేస్తున్న ముగ్గురు రైతులు మృతి చెందగా, ఉరుములతో కూడిన వర్షంతో వరంగల్ జిల్లావ్యాప్తంగా పలు నివాస కాలనీలు జలమయమై దైనందిన జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి.

మృతులు చిట్యాల మండలం గోపాల్‌పూర్‌ గ్రామానికి చెందిన ఆరెపల్లి వానమ్మ (56), రేగొండ మండలం పొనగండ్ల గ్రామానికి చెందిన వంగ రవి (48), మల్హర్‌ మండలం చట్రాజపల్లి గ్రామానికి చెందిన కాటం రఘుపతిరెడ్డి (25)గా గుర్తించారు. కాగా, వరంగల్‌ నగరంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలతో కాలనీలు నీట మునిగాయి. వరంగల్ నగరంలో బుధవారం అత్యధికంగా 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాయిగణేష్ నగర్, ఎస్ఆర్ నగర్, గరీబ్ నగర్, ఎన్టీఆర్ నగర్, శివ నగర్ కాలనీలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. నగరంలోని సంతోషి మాత టెంపుల్ రోడ్డు, బృందావన్ కాలనీకి వెళ్లే రహదారులు నీటమునిగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతోపాటు హన్మకొండలోని హంటర్ రోడ్డు కూడా జలమయమైంది.

వరంగల్ మేయర్ గుండు సుధా రాణి ఎన్టీఆర్ నగర్, బీఆర్ నగర్ కాలనీలను పరిశీలించి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. వారిని సహాయక శిబిరాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో 84.6 మి.మీ, బయ్యారం మండలంలో 82.6 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ నీటి ప్రవాహానికి కురవిలోని నేరేడు-రాయపట్నం మధ్య లోతట్టు వంతెన నీట మునిగింది. మరోవైపు కొత్తగూడ మండలం వేలుబెల్లి సరస్సు సమీపంలో మధ్యాహ్నం గాలివాన ఏర్పడడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘణపూర్ మండలంలో 64.2 మి.మీ, భూపాలపల్లి మండలంలో 61 మి.మీ వర్షపాతం నమోదైంది. కాగా, రానున్న మూడు రోజులు పాటు రాష్ట్రంలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది. చాలా చోట్ల మోస్తారు  నుంచి భారీ-అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. 

కేరళలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.. 

ఇదిలావుండ‌గా, జూలై 31 నుండి కేరళ నుండి 12 రుతుపవనాల ప్రేరేపిత మరణాలు నమోదయ్యాయ‌ని అధికారులు తెలిపారు. అలాగే, 2,291 మందిని 95 సహాయ శిబిరాలకు తరలించారు. బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలందరూ ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ కోరారు. కొట్టాయంలో అత్యధిక సంఖ్యలో సహాయ శిబిరాలు (21) ఉన్నాయి. ఈ శిబిరాల్లో 447 మంది ఆశ్రయం పొందారు. త్రిసూర్‌లో అత్యధిక సంఖ్యలో ప్రజలు సహాయక శిబిరాలకు తరలివెళ్లారు (15 శిబిరాల్లో 657 మంది). గత రెండు రోజుల్లో ఉత్తరాది జిల్లాల్లో 27 ఇళ్లు పూర్తిగా, 123 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో 23 ఇళ్లు పూర్తిగా, 71 పాక్షికంగా దెబ్బతిన్నాయి. మంగళవారం నమోదైన ఆరు మరణాల్లో మూడు కన్నూర్‌లో నమోదయ్యాయి. జిల్లాలోని కొండ ప్రాంతమైన కణిచర్లలో కొండచరియలు విరిగిపడ్డాయి. కన్నూర్, వాయనాడ్‌లను కలుపుతూ నెడుంపోయిల్-మనంతవాడి రహదారి వెంబడి 3 కి.మీ దూరం పూర్తిగా దెబ్బతింది.

Follow Us:
Download App:
  • android
  • ios