రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదు.. : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Hyderabad: రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని తెలంగాణ గవర్నర్ మరోసారి ఆరోపించారు. ఇప్పటి వరకు రిపబ్లిక్ డే వేడుకల గురించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
Governor Tamilisai Soundararajan: రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని తెలంగాణ గవర్నర్ మరోసారి ఆరోపించారు. ఇప్పటి వరకు రిపబ్లిక్ డే వేడుకల గురించి తమకు ఎలాంటి సమాచారం రాలేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. తన కార్యాలయం విషయంలో ప్రోటోకాల్ పాటించడం లేదని, రాబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ప్రభుత్వం నుంచి తనకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. అలాగే, ఖమ్మం పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కొందరు నేతలు రాజ్ భవన్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గవర్నర్లు, కేంద్రంపై చేసిన వ్యాఖ్యలపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. రాజకీయ పరిస్థితులపై తాను వ్యాఖ్యానించదలుచుకోలేదని అన్నారు. గవర్నర్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అయితే, తెలంగాణలో మాదిరిగానే కొన్నిసార్లు గవర్నర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
తాను తన డ్యూటీ చేస్తున్నాననీ, తన వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని అంగీకరించారు. వాటిని విశ్లేషించాల్సి ఉందని తాను ఇదివరకే చెప్పానని ఆమె గుర్తు చేసుకున్నారు. కొన్నిసార్లు తెలంగాణ తరహాలోనే గవర్నర్లకు వ్యతిరేకంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారన్నారు. "ఎందుకంటే, ఇక్కడ నేను బహిరంగంగా చెప్పగలను.. నేను దేనినీ వ్యతిరేకించడం లేదు. నా డ్యూటీ నేను చేస్తున్నాను. కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకంటే.. నేను వాటిని అంచనా వేయాలి, విశ్లేషించాలి అని ఇప్పటికే చెప్పాను' అని రాజ్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె విలేకరులతో అన్నారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య ఉన్న విభేదాల గురించి ప్రస్తావిస్తూ.. తన తప్పేమీ లేదనీ, ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని గవర్నర్ తమిళి సై అన్నారు.
"... ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వాల వైఖరి ఏమిటి అనేదానితో పాటు, ఇతరులపై నేను వ్యాఖ్యానించలేను. ఎలాంటి ప్రొటోకాల్ పాటించలేదు. ఇప్పటి వరకు రిపబ్లిక్ డే వేడుకల గురించి తమకు ఎలాంటి సందేశం రాలేదు" అని ఆమె అన్నారు. గవర్నర్ పదవిని గౌరవించాలని పేర్కొన్న తమిళి సై సౌందరరాజన్.. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. "నేను పదేపదే అడుగుతున్నది ఒక్కటే. ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్.. దీనికి వారే సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లుల గురించి అడిగినప్పుడు, ఆమె ఇప్పటికే సమాధానం ఇచ్చిన విషయాలను ఎత్తిచూపారు. ప్రోటోకాల్ సమస్య ఇంకా పెండింగ్లో ఉందని, గత ఏడాదిన్నరగా ఈ సమస్య పెండింగ్లో ఉందని ఆమె అన్నారు.
గవర్నర్లు హద్దులు (పదవి) దాటిపోయారన్న కొందరి ఆరోపణపై సౌందరరాజన్ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలను ఖండించారు. అదేమీ లేదని అన్నారు. బీజేపీ చెప్పినట్లే గవర్నర్లు నడుచుకున్నారనే ఆరోపణలపై ఆమె స్పందిస్తూ.. తాను జిల్లాల పర్యటనలో కలెక్టర్లు ప్రొటోకాల్ ఎందుకు పాటించలేదో రాష్ట్ర ప్రభుత్వం ముందుగా సమాధానం చెప్పాలని అన్నారు. గవర్నర్లు బాధ్యతాయుతమైన వ్యక్తులని, ఏమి చేయాలో చెప్పాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. కాగా, చాలా కాలం నుంచి రాజ్ భవన్, టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య సంబంధాలు బలహీనంగానే ఉన్నాయి. ఈ విభేదాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. సౌందరరాజన్ గతంలో ఆమె జిల్లాల పర్యటనలలో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపించారు. గత నవంబర్ లో అయితే, తన ఫోన్ కాల్ ట్యాప్ అవుతున్నదనే సంచలన ఆరోపణలు చేయడం పెద్దదుమారమే రేపింది.