కర్ణాటకలో జరుగుతున్న మైసూరు నేషనల్స్లో తెలంగాణ సెయిలర్లు తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. ఈ పోటీల్లో మన సెయిలర్సు 12 పతకాలు సాధించారు.
కర్ణాటకలో జరుగుతున్న మైసూరు నేషనల్స్లో తెలంగాణ సెయిలర్లు తమ విజయ పరంపరను కొనసాగిస్తున్నారు. కృష్ణరాజసాగర్ ఆనకట్ట వద్ద జరుగుతున్న ఈ పోటీల్లో మన సెయిలర్సు 12 పతకాలు సాధించారు. అంతేకాదు జూనియర్ నేషనల్ ర్యాంగకింగ్ రెగెట్టాలో ఏ రాష్ట్రం ఇంత వరకు ఈ స్థాయిలో పతకాలు సాధించకపోవడం విశేషం. తెలంగాణకు చెందిన దీక్షిత కొమరవెల్లి 39 మంది ఆడ, మగ సెయిలర్లలో మూడో స్థానంలో నిలిచింది.
కొన్ని తప్పిదాలు చేసి ఉండకపోతే ఆమె రెండోస్థానంలో నిలిచేది. అంతేకాదు.. దీక్షిత ఇప్పుడు నేషనల్ గర్ల్స్ ఛాంపియన్. అండర్-15 ఆప్టిమిస్ట్ క్లాస్లో బాలికల విభాగంలో ఇండియా నెం.1 . ఇంతకు ముందు తెలంగాణ నుంచి ఈ ఘనత సాధించిన ముగ్గురు అమ్మాయిలలో ప్రీతి కొంగర, ఝాన్సీ లావేటి, రవళి పరాండి ఉన్నారు.
45 పాయింట్ల భారీ తేడాతో దీక్షిత బాలికల గోల్డ్ మెడల్ సాధించగా భోపాల్కు చెందిన సమృద్ధి బాథమ్ 10వ స్థానంలో నిలిచింది. దీక్షిత సోదరి లాహిరి కొమరవెల్లి సైతం కాంస్య పతకం సాధించింది. వీరిద్దరూ ఉద్భవ్ పాఠశాలలో చదువుతున్నారు. అంతేకాదు.. వీరిద్దరూ జాతీయ ర్యాంకింగ్లో మెరుగైన స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్లో ముంబయిలో జూనియర్ నేషనల్ జరుగుతుండటంతో ఇద్దరూ 1, 2 ర్యాంకుల కోసం పోటీపడుతున్నారు.
420 మిక్స్డ్ అండ్ ఓపెన్ క్లాసుల్లో మాన్సూన్ రెగెట్టా ఛాంపియన్స్ కెప్టెన్ ధరణి లావేటి, సిబ్బంది మల్లేష్ వడ్ల 11 రేసుల్లో వరుసగా 9 రేసుల్లో విజయం సాధించారు. దీంతో దేశంలో అంతర్జాతీయ 420 క్లాస్ ను ఎవరు శాసిస్తున్నారనే విషయంలో ఎవరికీ సందేహాలు లేవు. తోటి తెలంగాణ సెయిలర్లు తనూజ కామేశ్వర్, శ్రవణ్లు కేవలం ఒక విజయంతో వరుసగా రెండో స్థానాలు సాధించి రజత పతకం సాధించారు. వీరిద్దరూ ఓపెన్ క్లాస్ లో స్వర్ణం, రజతం కూడా గెలుచుకున్నారు.
తెలంగాణకు చెందిన బన్ని బొంగూర్, డేనియల్ రాజ్ కుమార్, మహ్మద్ రిజ్వాన్ కూడా మైసూర్ నేషనల్స్ లో తమ ర్యాంకులలో పురోగతి సాధించారు. వీరు రాబోయే జూనియర్ నేషనల్స్ లో పైచేయి సాధించి, క్రీడా మంత్రిత్వశాఖ ఆర్థికసాయంతో ఇంటర్నేషనల్స్ లో అవకాశం పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు దాదీ భోటే మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న సరస్సు మాత్రమే ఉందని.. మిగిలినదంతా భూభాగమేననన్నారు.
అయినప్పటీకీ రాష్ట్రానికి చెందిన సెయిలర్లు 150కి పైగా పతకాలు సాధించారని ప్రశంసించారు. ఈ ఏడాది అంతర్జాతీయ 420 క్లాస్, ఆప్టిమిస్టిక్ క్లాస్లలో పరిస్థితి చాలా ఆశాజనకంగా ఉందని దాదీ భోటే పేర్కొన్నారు. ఆసియా క్రీడలకు ఫెడరేషన్ ఎంపిక చేసిన ప్రీతి కొంగర అనే అమ్మాయితో సెయిలింగ్లో గొప్ప పురోగతి సాధిస్తున్నామనంనారు. జాతీయ జట్టులో స్థానం పొందేందుకు రాష్ట్రం నుంచి చాలామంది సిద్ధంగా ఉన్నారని హైదరాబాద్కు చెందిన వైసీహెచ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షుడు, చీఫ్ కోచ్ సుహైమ్ షేక్ తెలిపారు.

