తెలంగాణలో ప్రారంభమైన పంచాయతీ ఎన్నికల పోలింగ్
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4479 పంచాయతీలకు గాను ఈ విడతలో 769 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4479 పంచాయతీలకు గాను ఈ విడతలో 769 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 70, 094 మంది అభ్యర్థులు ఉన్నారు.
తొలి విడత ఎన్నికల్లో 10, 654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. సుమారు 26 వేలమంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నాం 2 తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రానిక ఫలితాలను ప్రకటించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, తొలి విడతలో 769 సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్లోని కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం పోలింగ్ సరళిని పర్యవేక్షించనుంది.