ఆ జీవోల ప్రకారమే నీటి వినియోగం:ఏపీపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.
హైదరాబాద్: అక్రమ ప్రాజెక్టులతో తెలంగాణ నీటిని ఏపీ దోచుకొంటుందన్నారు. నీటి పంపకాల్లో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తామని ప్రధాని మోడీ చెప్పలేదా అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా నదిలో 26 శాతం క్యాచ్మెంట్ ఏరియా ఉన్న ఏపీకి 66 శాతం నీళ్లు పోతున్నాయని ఆయన చెప్పారు.
also read:జలవివాదం: ఏపీకి తెలంగాణ కౌంటర్, కేఆర్ఎంబీ తీరుపై కూడ అసంతృప్తి
ఏ అనుమతులు లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జీవోల ప్రకారంగానే తెలంగాణ ప్రభుత్వం నీటిని వాడుకొంటుందని ఆయన చెప్పారు.విద్యుత్ ప్రాజెక్టులున్న దగ్గర నుండి నీటిని వాడుకోవచ్చని నిబంధనలు చెబుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.తెలంగాణ ఉద్యమ కాలంలోనూ తాము సెటిలర్స్ అనే పదం వాడలేదన్నారు. ఏపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్ ప్రాజెక్టు మాత్రమేనని ఆయన తేల్చి చెప్పారు.