Asianet News TeluguAsianet News Telugu

ఓఎంసీ కేసు: సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఓబుళాపురం మైనింగ్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  సీబీఐ కోర్టులో సోమవారం నాడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

Telangana minister Sabitha indra Reddy files discharge petition in cbi court over omc case lns
Author
Hyderabad, First Published Dec 7, 2020, 7:40 PM IST

హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  సీబీఐ కోర్టులో సోమవారం నాడు డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో తన పేరును తొలగించాలని కోరుతూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.  ఓఎంసీ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిపై సీబీఐ అభియోగాలు నిరాధారమని మంత్రి తరపున లాయర్ వాదించారు.

ఈ పిటిషన్ పై ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.ఓఎంసీ కేసులో  మాజీ ఐఎఎస్ అధికారి కృపానందం తన పేరును అన్యాయంగా ఇరికించారని  గత వారంలో కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.

తొలి రెండు చార్జీషీట్లలో తన పేరును చేర్చారని ఆయన ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఓఎంసీ కేసు అప్పట్లో రాజకీయంగా సంచలనమైన విషయం తెలిసిందే.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డిపై అప్పట్లో  ఈ కేసు నమోదైంది. ఈ కేసులో కొందరు అధికారుల పేర్లు కూడ ఉన్నాయి.ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios