Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జలాలపై చట్టబద్ద హక్కులను వదులుకోం: తేల్చేసిన కేటీఆర్

కృష్ణా జలాలపై తమ చట్టబద్ధ హక్కులను పోరాటం కొనసాగిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు ఆయన గుర్తు చేశారు. 

Telangana KTR interesting comments on pothireddypadu
Author
Hyderabad, First Published Aug 9, 2020, 3:29 PM IST


హైదరాబాద్:కృష్ణా జలాలపై తమ చట్టబద్ధ హక్కులను పోరాటం కొనసాగిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ విషయమై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసినట్లు ఆయన గుర్తు చేశారు.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో తమకు సత్సంభాధాలున్నాయని కానీ రాష్ట్ర హక్కుల పై ఎలాంటి రాజీ ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

మంత్రి కెటీఆర్ ఈ రోజు ట్విట్టర్ లో ఆస్క్ కెటియార్ (#AskKtr)కార్యక్రమంలో ఆదివారం నాడు  ప్రజలతో సంభాషించారు. పెద్ద ఎత్తున కరోనా చికిత్సకు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై ఇప్పటికే చర్యలు తీసుకున్నామన్నారు. అవసరమైతే మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించాలని సందర్భంగా కోరారు. 

ప్రయివేట్ ఆసుపత్రులు నిరాకరించిన వారికీ సైతం ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్యసిబ్బంది సేవలకు ప్రజలు మరింత గుర్తింపు, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇప్పటికే సుమారు 1200 పైగా సెంటర్లలో కరోనా టెస్టింగ్ జరుగుతుందని  ప్రస్తుతం రోజుకు 23 వేలకు పైగా కొనసాగుతున్న టెస్టుల సంఖ్య రానున్న రోజుల్లో 40 వేలకు పైగా పెరిగే అవకాశం ఉందన్నారు. కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కంటే తక్కువగా ఉన్నదని, రికవరీ రేటు దేశంలోని అత్యుత్తమంగా 72 శాతంగా నమోదవుతుందని  మంత్రి కేటీఆర్ చెప్పారు.

కొవిడ్ పైన జరుగుతున్న యుద్ధంలో ప్రజలంతా కూడా ప్రభుత్వంతో కలిసి రావాలని కేవలం ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోతుందన్నారు.  చదువుకున్న విద్యావంతులు ప్రజాస్వామిక ప్రక్రియలో భాగస్వాములుగా ఉండాలని ముఖ్యంగా చదువుకున్న యువత సైలెన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదని అన్నారు.

రాష్ట్రంలో సిటీ బస్సులు, ఎంఎంటిఎస్ లు మరియు మెట్రోరైల్ వంటి సేవల ప్రారంభానికి కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కోసం వేచి చూస్తున్నామని మంత్రి తెలిపారు.కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని ఆయన చెప్పారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు.
    
త్వరలోనే ఎలిమినేడు ఏరోస్పేస్ పార్క్ కి శంకుస్థాపన ఉంటుందని మంత్రి ప్రకటించారు.గ్రామీణ ప్రాంతాల డిజిటలైజేషన్ పైన కూడా స్పందించిన మంత్రి తెలంగాణ ఫైబర్ గ్రిడ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. 

అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి స్పందించారు. భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల, మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి  లభించే రామ రాజ్యం రావాలన్న  కోరికను ఆయన వ్యక్తం చేశారు.

తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే కంపెనీలకు మరిన్ని అదనపు రాయితీలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. 

కేవలం హైదరాబాద్ పైనే మంత్రిగా మీరు దృష్టి సారిస్తున్నారన్న ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలకు నిరంతరం నిధులు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా లక్ష్యాలు పెట్టి వారితో పని చేయిస్తూ వాటిని సమీక్షిస్తున్నామని త్వరలోనే మంచి ఫలితాలు చూస్తారని మంత్రి అన్నారు

Follow Us:
Download App:
  • android
  • ios