తాజాగా తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్ లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ విద్యార్థి ఒకరు suicide చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు viral గా మారింది. గణేష్ రూపాన్ని హ్యాండిల్ నుంచి twitterలో ఈ పోస్ట్ షేర్ అయింది. నా ఆత్మహత్యకు మీరే కారణం అని చెబుతూ మంత్రి కేటీఆర్, అలాగే మంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ట్యాగ్ చేశాడు
తాజాగా తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్ లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఇంటర్ బోర్డు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటా అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
గణేష్ రూపానీ.. ఐ యామ్ గణేష్123 (@iam_ganesh123) అనే హ్యాండిల్ నుంచి ట్విట్టర్లో ఈ పోస్ట్ షేర్ అయింది. గైస్ నేను 4 సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాను అంటూ పోస్ట్ చేశాడు గణేష్. ‘ఎగ్జామ్ లో ఏం రాసినా పాస్ చేస్తా అని సార్ చెప్పి ఇప్పుడు అందరినీ ఫైల్ చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ganesh rupani. అంతే కాదు తాను ఇప్పుడే suicide చేసుకోబోతున్న అంటూ పోస్టులో పేర్కొన్నాడు. నా ఆత్మహత్యకు మీరే కారణం అని తెలుపుతూ మంత్రి KTR అలాగే మంత్రి Sabita Indrareddy లను టాక్స్ చేశాడు
రిప్ మీ #RipMe బ్యాండ్ టిఎస్ గవర్నమెంట్ #BanTsGovt అనే హ్యాష్ ట్యాగ్ లతో ఈ ట్వీట్ పోస్ట్ అయ్యింది. అలాగే రూపానీ గణేష్ తన మార్కు లిస్ట్ లను కూడా పోస్ట్ కు అటాచ్ చేశాడు. కేవలం తెలుగు, ఇంగ్లీష్ లో పాస్ అయినట్లు మిగితా సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లు అందులో ఉంది. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాడు గణేష్. ఈ తెలంగాణ ఇంటర్ బైపీసీ స్టూడెంట్ పోస్ట్ పై గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అలాగే గణేష్ ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఆ విద్యార్థికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ట్వీట్ కొద్ది నిమిషాల్లోనే డిలీట్ అయింది.
TS Inter 1st Year Results 2021: మొత్తం ఉత్తీర్ణత 49 శాతం.. బాలురపై బాలికలదే పైచేయి
ఇదిలా ఉండగా, గురువారం TS Inter 1st Year Results 2021ను తెలంగాణ ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది. ఫస్టియర్లో 49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలికలు 56 శాతం, బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. 4,59,242 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా.. 2,24,012 మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థుల పరీక్షలు corona second wave సందర్భంగా వాయిదా వేశారు. ఆ ఎగ్జామ్స్ను అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ మొదటి వారం వరకు నిర్వహించారు. ఇటీవలే ఆ పరీక్ష పేపర్ల వాల్యూవేషన్ పూర్తి కావడంతో ఫలితాలు ప్రకటించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. tsbie.cgg.gov.in అనే వెబ్ సైట్లో విద్యార్థులు ఫలితాలను చూడవచ్చు.
