Asianet News TeluguAsianet News Telugu

ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌కు హైకోర్టు నోటీసులు

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Telangana High Court Issues notice to MIM MLA Akbaruddin Owaisi
Author
Hyderabad, First Published Dec 13, 2019, 1:46 PM IST

హైదరాబాద్:  ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌‌కు  తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను  అక్బరుద్దీన్‌‌ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై హైకోర్టు అక్బరుద్దీన్‌కు నోటీసులు జారీ చేసింది.

2012 లో నిజామాబాద్‌లో జరిగిన ఓ సభలో అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ  వ్యాఖ్యలపై అక్బరుద్దీన్‌ బెయిల్ వచ్చింది. ఈ కేసులో అక్బరుద్దీన్ కు బెయిల్ వచ్చింది. అయితే ఈ కేసులో బెయిల్‌పై ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ పదే పదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఓ పిటిషన్ దాఖలైంది.

అక్బరుద్దీన్ ఓవైసీ కి ఉన్న బెయిల్‌ను రద్దు చేయాలని  పిటిషనర్ కోరారు. ఈ విషయమై దాఖలైన  పిటిషన్‌పై  అక్బరుద్దీన్‌ కు, సీఐడీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.

ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఈ నోటీసులకు ఏం సమాధానం చెబుతారనే విషయం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios